యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయి?
కొవిడ్ ఒకసారి వస్తే... మళ్లీ రాదా? బాధితుల్లో కరోనా ప్రతినిరోధకాలు (యాంటీబాడీలు) ఎంతకాలం ఉంటాయి? యాంటీబాడీలు లేకపోయినా,
సింగపూర్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
సింగపూర్: కొవిడ్ ఒకసారి వస్తే... మళ్లీ రాదా? బాధితుల్లో కరోనా ప్రతినిరోధకాలు (యాంటీబాడీలు) ఎంతకాలం ఉంటాయి? యాంటీబాడీలు లేకపోయినా, రోగనిరోధక వ్యవస్థ వారికి రక్షణ కల్పిస్తుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కనుగొన్నారు... సింగపూర్ శాస్త్రవేత్తలు! కరోనా ప్రతినిరోధకాలు కొందరిలో రోజుల వ్యవధిలోనే కనుమరుగైతే... మరికొందరిలో ఏళ్ల తరబడి ఉనికిని చాటుకుంటాయని లెక్కగట్టారు. బాధితుల రోగనిరోధక శక్తి, కొవిడ్-19 ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టే ఈ వ్యత్యాసం ఉంటున్నట్టు వారు విశ్లేషించారు. సింగపూర్లోని డ్యూక్-ఎన్యూఎస్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు 164 మంది కొవిడ్ బాధితులను 9 నెలలపాటూ పరీక్షించారు. వారిలోని యాంటీబాడీలు, టి-కణాలు, రోగనిరోధక వ్యవస్థ సంకేతాల తీరును తెలుసుకున్నారు. ఈ వివరాలను గణిత నమూనా ద్వారా విశ్లేషించి, బాధితులను ఐదు గ్రూపులుగా విభజించారు.
వారు:
1) కరోనా యాంటీబాడీలు ఏమాత్రం అభివృద్ధికాని ‘నెగెటివ్ గ్రూపు’ వారు (11.6%)
2) ప్రతినిరోధకాలు అభివృద్ధి చెందినా, త్వరగా వాటిని కోల్పోయే ‘ర్యాపిడ్ వేనింగ్’ వారు (26.8%)
3) కనీసం 6 నెలలపాటు యాంటీబాడీలు ఉండేవారు (29%)
4) 180 రోజుల వ్యవధిలో ప్రతినిరోధకాల స్థాయి స్వల్పంగా మార్పు చెందేవారు (31.7)
5) ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత, ప్రతిస్పందన ఆలస్యమయ్యేవారు (1.8%).
‘‘బాధితుల్లో యాంటీబాడీలు అంతంత మాత్రంగానే ఉన్నా, రోగనిరోధక వ్యవస్థలోని టి-కణాలు శక్తిమంతంగా ఉంటే వారు మళ్లీ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా అవి కాపాడతాయి. వ్యాక్సిన్ల ద్వారా యాంటీబాడీలు ఉత్పత్తి అయినా, కొందరిలో అవి ఎక్కువకాలం ఉండకపోవచ్చు. ఇలాంటి వారు ఏటా వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిది’’ అని పరిశోధనకర్త వాంగ్ లిన్ఫా చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల