Black fungus: కొత్త మార్గదర్శకాలివే..
ప్రాణాంతక కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారిని ప్రస్తుతం వేధిస్తున్న మరో సమస్య బ్లాక్ ఫంగస్. పలు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటికే దీంతో 90 మంది మరణించారు. రాజస్థాన్లో 100కు పైగా కేసులు నమోదవడంతో దీనిని అంటువ్యాధుల జాబితాలో చేర్చారు.
సూచించిన ఎయిమ్స్, దిల్లీ
దిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారిని ప్రస్తుతం వేధిస్తున్న మరో సమస్య బ్లాక్ ఫంగస్. పలు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటికే దీంతో 90 మంది మరణించారు. రాజస్థాన్లో 100కు పైగా కేసులు నమోదవడంతో దీనిని అంటువ్యాధుల జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) బ్లాక్ ఫంగస్ను ఎదుర్కొనేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎలాంటి సందర్భాల్లో ఈ ఫంగస్ సోకుతుంది, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై పలు సూచనలు చేసింది.
ఎవరికి ముప్పు ఎక్కువగా ఉంటుందంటే..
> మధుమేహం అదుపులో లేనివారు, బాగా స్టెరాయిడ్స్ తీసుకొనేవారు
> రోగ నిరోధక మందులు, యాంటీ క్యాన్సర్ చికిత్స తీసుకొనేవారు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నవారు
> చాలా కాలంపాటు స్టెరాయిడ్స్ తీసుకొనేవారు
> కరోనా తీవ్రమై, ఆక్సిజన్ వెంటిలేటర్ సపోర్టుతో ఉండి, కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చే ముప్పు ఉంటుందని ఎయిమ్స్ వెల్లడించింది. బాధితులు వైద్యుల సలహాతో తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.
ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఏంటంటే..?
• ముక్కు నుంచి నల్లటి స్రావాలు, రక్తం కారడం
• ముక్కు మూసుకుపోవడం, తలనొప్పి, కంటినొప్పి, కంటి చుట్టూ వాపు, ఎర్రగా అవడం, దృష్టి కోల్పోవడం, కన్ను మూసి తెరవడంలో ఇబ్బందులు
• ముఖం తిమ్మిరిగా అనిపించడం
• నోరు తెరవడం, నమలడంలో సమస్యలు
• దంతాలు వదులుగా అనిపించడం, నోటి లోపలి ప్రాంతాల్లో వాపు
ఎవరికి వారు తరచుగా ముఖాన్ని పరీక్షించుకోవాలని ఎయిమ్స్ సూచించింది. ముఖంలో వాపు రావడం, కంటి కింద, ముక్కు, చెంపల భాగాల్లో నలుపు రంగు ఉందేమో చూసుకోవాలి. ఎక్కడైనా ముట్టుకుంటే నొప్పి వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇన్ఫెక్షన్ ఉన్నపుడు ఏం చేయాలంటే?
* వెంటనే చెవి-ముక్కు-గొంతు(ఈఎన్టీ) వైద్యులను సంప్రదించాలి
* రక్తంలో గ్లూకోజ్ను పరిశీలిస్తూ, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి.
* వైద్యులు సూచించిన ఔషధాలనే వాడాలి. సొంతవైద్యం చేసుకోకూడదు.
* వైద్యుల సూచన మేరకు అవసరమైనపుడు మాత్రమే ఎమ్మారై, సీటీ స్కాన్లు చేయించాలి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు