Oral Vaccine: తయారీకి శాస్త్రవేత్తలు సిద్ధం!
నోటి ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ను రూపొందించేందుకు కోల్కతాలోని ఐసీఎంఆర్-ఎన్ఐసీఈడీ శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.
కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఐసీఎంఆర్-ఎన్ఐసీఈడీ
కోల్కతా: కరోనా వైరస్ను నిరోధించే వ్యాక్సిన్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇప్పటివరకూ వచ్చిన వ్యాక్సిన్లన్నీ ఇంజక్షన్ రూపంలోనే తీసుకోవాల్సి ఉంది. ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్పై ఇప్పటికే ప్రయోగాలు జరుగుతుండగా.. తాజాగా నోటి ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ను రూపొందించేందుకు భారత శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఇందుకు కోల్కతాలోని ఐసీఎంఆర్-ఎన్ఐసీఈడీ శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
నోటిద్వారా అందించే కరోనా వ్యాక్సిన్ (Oral Covid Vaccine)ను అభివృద్ధి చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ICMR)- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటెరిక్ డిసీజెస్ (NICED) శాస్త్రవేత్తలు సంకల్పించారు. ఇందుకోసం మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ విభాగానికి తాజాగా ఓ ప్రతిపాదనను పంపించామని ఐసీఎంఆర్-ఎన్ఐసీఈడీ సంస్థ డైరెక్టర్ శాంతా దత్త పేర్కొన్నారు. జర్మన్కు చెందిన ఓ సంస్థ భాగస్వామ్యంతో ఈ పరిశోధనా ప్రాజెక్టును చేపడతామన్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతి, నిధుల సమీకరణ జరిగిన వెంటనే పరిశోధనలు ప్రారంభిస్తామని శాంతా దత్తా వెల్లడించారు. అయితే, నోటి ద్వారా తీసుకునే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఐదు నుంచి ఆరేళ్ల సమయం పడుతుందని అంచనా వేశారు.
నోటి ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ రూపొందించిన అనంతరం తొలుత వాటిని జంతువులపై ప్రయోగాలు జరపాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ సురక్షితమైనదో కాదో తెలుసుకోవడంతో పాటు వైరస్ను నిరోధించే సామర్థ్యాన్ని అంచనా వేస్తాం. తర్వాత మాత్రమే జంతువులపై ప్రయోగిస్తామని శాంతా దత్త పేర్కొన్నారు. ఇదిలాఉంటే, ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ను ఇప్పటికే భారత్ బయోటెక్ రూపొందించింది. ప్రస్తుతం వాటిపై క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!