Nuclear Bomb: మన సత్తాపై ‘అణు’మానాలు తీరిన రోజు
భారత్ అణు బాంబు తయారుచేస్తే గడ్డి తిని.. అవసరమైతే పస్తులుండైనా మేమూ అణు బాంబును తయారుచేస్తాం.
పోఖ్రాన్-1 పరీక్షకు 50 ఏళ్లు
భారత్ అణు బాంబు తయారుచేస్తే గడ్డి తిని.. అవసరమైతే పస్తులుండైనా మేమూ అణు బాంబును తయారుచేస్తాం. అంటూ భారత్ పరీక్షలు నిర్వహించడానికి 9 ఏళ్ల ముందే ప్రకటించిన పాక్.. ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది.
1974 మే 18
భారత దేశ చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. ప్రపంచ యవనికపై మన దేశం సాంకేతిక సత్తా చాటిన రోజు. యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న పొరుగు దేశాలకు గట్టి సందేశం పంపిన రోజు. సరిగ్గా 50 ఏళ్ల కిందట ఇదే రోజు భారత్ తన తొలి అణు పరీక్షను నిర్వహించింది. తద్వారా ఆ సత్తా చాటిన అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల సరసన సగర్వంగా నిలిచింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంలేని దేశం అణు పరీక్ష నిర్వహించడం అదే మొదటిసారి. దీనిపై అగ్గిమీద గుగ్గిలమైన కొన్ని అగ్రరాజ్యాలు ఆంక్షలతో అక్కసు వెళ్లగక్కాయి. అయినా మన దేశం నిలదొక్కుకుంది. సాంకేతిక పురోగతితో ముందడుగు వేసింది.
అణ్వస్త్రాల అభివృద్ధి ఎందుకు?
భారత్ అణు పరీక్షకు పూనుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. 1962లో మన దేశంపై చైనా దురాక్రమణకు పాల్పడింది. అక్సాయ్చిన్ ప్రాంతాన్ని ఆక్రమించింది. 1964లో అణ్వస్త్రాన్ని పరీక్షించింది. ఇది భారత్ను ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికే సంప్రదాయ ఆయుధాల విషయంలో మనకన్నా పైచేయి సాధించిన ప్రత్యర్థి.. అణ్వస్త్రం విషయంలోనూ ముందంజలో ఉన్నట్లు గుర్తించింది.
ఇటు పక్క పాకిస్థాన్ రూపంలోనూ మరో శత్రుదేశం భారత్కు ఉంది. 1965 నాటికి ఆ దేశంతో రెండు యుద్ధాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు దీటుగా రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకొని, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవాలన్నది లక్ష్యం. దీన్ని సాధించే దిశగా అణ్వస్త్రాల అభివృద్ధి కీలక అడుగు అని మన దేశం ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చింది.
1971 డిసెంబరులో భారత్-పాక్ యుద్ధం జరుగుతున్న సమయంలో మన దేశాన్ని బెదిరించడానికి అమెరికా తన విమానవాహక నౌక యూఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ను బంగాళాఖాతంలోకి పంపింది. దీనికి స్పందనగా సోవియట్ యూనియన్.. అణు క్షిపణులు కలిగిన ఒక జలాంతర్గామిని మోహరించింది. దీంతో అమెరికా యుద్ధనౌక అక్కడి నుంచి వైదొలిగింది. ఈ పరిణామంతో అణ్వస్త్రాలు, బాలిస్టిక్ క్షిపణుల సత్తా గురించి నాటి ప్రధాని ఇందిరా గాంధీకి అవగతమైంది.
భారత అణు ప్రస్థానం ఇలా..
1944లో హోమీ జహంగీర్ భాభా.. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)ను ఏర్పాటు చేయడంతో భారత అణు కార్యక్రమానికి పునాదులు పడ్డాయి. స్వాతంత్య్రం వచ్చాక అణు పరిశోధనలకు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లాంఛనంగా అనుమతినిచ్చారు. శాంతియుత కార్యక్రమాలకే వాటిని పరిమితం చేయాలన్నారు.
- భాభా నేతృత్వంలో క్రమంగా అణ్వాయుధ రూపకల్పన వైపు అడుగులు పడ్డాయి. 1954 నుంచి 1959 మధ్య ఈ పరిశోధన ఊపందుకుంది.
- భాభా మరణం తర్వాత అణ్వస్త్ర పరిశోధన కార్యక్రమాన్ని భౌతికశాస్త్రవేత్త రాజా రామన్న పర్యవేక్షించారు.
- లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధాని అయ్యాక.. భౌతిక శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ను అణు కార్యక్రమానికి అధిపతిగా నియమించారు. అయితే గాంధేయ సిద్ధాంతాలకు కట్టుబడ్డ శాస్త్రి.. ఈ ప్రాజెక్టును శాంతియుత అవసరాలకే పరిమితం చేశారు.
- 1966లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అణు కార్యక్రమంలో జోరు పెరిగింది.
- అణు సాధనాన్ని రూపొందించి, పరీక్షకు సిద్ధం చేయడానికి భాభా అణు పరిశోధన కేంద్రాని(బార్క్)కి 1972 సెప్టెంబరు 7న ఇందిరా గాంధీ అనుమతిచ్చారు.
అమలు ఇలా..
అణు పరీక్షకు ప్రభుత్వం పచ్చజెండా ఊపాక దాన్ని సాకారం చేయడానికి రెండేళ్లపాటు పరిశోధకులు కసరత్తు చేశారు.
పరీక్ష సాధనం: ఇది అణు విచ్ఛిత్తి సాధనం. దీని సామర్థ్యం 12-13 కిలోటన్నులు. జపాన్లోని హిరోషిమాపై ప్రయోగించిన అణు బాంబు సామర్థ్యం దాదాపు 15 కిలోటన్నులు.
పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు: ‘బార్క్’ డైరెక్టర్ హోదాలో రాజా రామన్న నేతృత్వంలో పి.కె.అయ్యంగార్, రాజగోపాల చిదంబరం తదితరులతో కూడిన 75 మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందం ఈ బాంబు రూపకల్పన, పరీక్షలో పాలుపంచుకుంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా అందులో ఉన్నారు. అణు బాంబుకు మీటను ప్రణబ్ దస్తిదార్ రూపొందించారు.
- ఈ అణు బాంబులో వాడిన ఆయుధ గ్రేడ్ ప్లుటోనియం అభివృద్ధిలో.. రసాయన ఇంజినీరు హోమీ సెథ్నా కీలక పాత్ర పోషించారు.
- రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఉన్న పోఖ్రాన్ అనే మారుమూల ప్రదేశాన్ని ఈ పరీక్ష కోసం ఎంచుకున్నారు.
- 1974 మే 18న ఉదయం 8.05 గంటలకు అణు పరీక్ష జరిగింది. ప్రణబ్ దస్తిదార్ మీట నొక్కి ఈ విస్ఫోటాన్ని నిర్వహించారు. పరీక్ష దిగ్విజయంగా సాగింది. వాతావరణంలో ఎలాంటి రేడియోధార్మికత కనిపించలేదు.
- పరీక్ష విజయవంతమైన విషయాన్ని ‘బుద్ధుడు ఎట్టకేలకు నవ్వాడు’ అనే సంకేతనామం ద్వారా ఫోన్లో ఇందిరకు రాజా రామన్న తెలియజేశారు.
- ప్రపంచాన్ని అణ్వస్త్రసహిత, రహిత దేశాలుగా విభజించిన అణు వ్యాప్తి నిరోధక చట్టం (ఎన్పీటీ) ఖరారైన ఆరేళ్ల తర్వాత మన దేశం ఈ పరీక్ష నిర్వహించింది.
ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా
ఈ అణు పరీక్షకు ‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా’ అని పేరు పెట్టారు. బుద్ధ జయంతి కూడా అదే రోజు కావడంతో ఈ పేరు ఖరారు చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మాత్రం దీన్ని పోఖ్రాన్-1గా నామకరణం చేసింది. ప్రపంచ దేశాల్లో ఆగ్రహావేశాలను చల్లార్చడానికి ఈ పరీక్షను ‘శాంతియుత అణు విస్ఫోటం’గా ఇందిర అభివర్ణించారు.
అంతర్జాతీయ స్పందన
దాదాపుగా అన్ని దేశాలూ భారత అణుపరీక్షను ఖండించాయి. కెనడా భారీగా ఆంక్షలు విధించింది. భారత్కు అందించే సాయాన్ని అమెరికా నిలిపివేసింది. ఆంక్షలూ విధించింది. మన అణు పరీక్షలకు స్పందనగా అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్జీ) ఏర్పాటైంది. అణు సంబంధిత పదార్థాలు, యంత్రాల ఎగుమతులను నియంత్రించడం దీని ఉద్దేశం.
పోఖ్రాన్లోనే ఎందుకు?
- అణుపరీక్ష పూర్తయ్యేవరకూ ఈ ప్రాజెక్టును గోప్యంగా ఉంచాలని ఇందిర ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్ష కోసం చేస్తున్న ఏర్పాట్లు విదేశీ గూఢచారులు, నిఘా ఉపగ్రహాల కంటపడకుండా జాగ్రత్త వహించింది. ఈ కోణంలో పోఖ్రాన్ను అనువైన ప్రాంతంగా గుర్తించింది. అక్కడి భౌగోళిక, వాతావరణ అంశాలు ఇందుకు చక్కగా ఉపయోగపడ్డాయి.
- ఉద్దేశపూర్వకంగా మే నెలలో ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ నెలలో పోఖ్రాన్లో తీవ్ర గాలుల కారణంగా పెను ఇసుక తుపాన్లు ఏర్పడుతుంటాయి. ఇవి అమెరికా నిఘా ఉపగ్రహాల వీక్షణకు ఆటంకం కలిగిస్తాయి.
- ఆ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అణ్వస్త్ర పరీక్షకు జరిగే సన్నాహాలను ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు కూడా పసిగట్టలేవు.
- 1998లో పోఖ్రాన్-2 పేరిట భారత్ ఇదే ప్రాంతంలో ఐదు అణు పరీక్షలు నిర్వహించింది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్లో ట్రేడింగ్ పేరుతో.. వ్యాపారి నుంచి రూ.9 కోట్లు స్వాహా
WhatsApp Trading fraud: వాట్సప్ గ్రూప్లో ట్రేడింగ్ అంటూ భారీ లాభాల ఆశ చూపి ఓ వ్యాపారి నుంచి ఏకంగా రూ.9 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. -
ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు ఖాయం: ఖర్గే
లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 295కు పైగా సీట్లు సాధిస్తుందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. -
దిల్లీ రికార్డు ఉష్ణోగ్రత.. సెన్సర్ ఎర్రర్ కారణం: కేంద్రం
దేశ రాజధాని దిల్లీ (Delhi)లో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలపై కేంద్రం తాజాగా స్పష్టత ఇచ్చింది. సెన్సర్ సమస్యే అందుకు కారణమని తెలిపింది. -
ఎగ్జిట్ పోల్స్పై చర్చల్లో పాల్గొంటాం..: ‘ఇండియా’ కూటమి ప్రకటన
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనాలని ‘ఇండియా’ కూటమికి చెందిన పార్టీలు నిర్ణయించాయి. -
కేజ్రీవాల్ ఇంటికి అంబులెన్స్ పంపిన భాజపా నేత
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్య సమస్యల దృష్ట్యా తనకు బెయిల్ పొడిగించాలని సుప్రీంను అభ్యర్థించిన నేపథ్యంలో భాజపా నేత, సీఎం ఇంటికి అంబులెన్స్ పంపడం రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీసింది. -
పుట్టెడు దుఃఖంలోనూ.. ‘ఓటు’ బాధ్యత మరవలేదు
ఇంటి పెద్దదిక్కు కన్ను మూసినా.. ఓటును హక్కును మరవలేదు బిహార్లోని ఓ కుటుంబం. ఓటు బాధ్యతను నిర్వర్తించాకే.. అంత్యక్రియులు నిర్వహించింది. -
బెయిల్పై కేజ్రీవాల్కు దక్కని ఊరట.. రేపు తిరిగి జైలుకు
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును దిల్లీకోర్టు జూన్ 5కు వాయిదా వేసింది. దాంతో రేపు ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. -
లైంగిక దౌర్జన్యం కేసు.. పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి..!
Prajwal Revanna: మహిళలపై అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ముగిసిన సుదీర్ఘ ధ్యానం.. తిరువళ్లువర్కు మోదీ నివాళులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 45 గంటల సుదీర్ఘ ధ్యానం ముగిసింది. -
92 ఏళ్లలో తొలిసారి ఓటు.. వృద్ధుడి ఆనందం!
ఝార్ఖండ్లోని సాహిబ్గంజ్కు చెందిన ఖలీల్ అన్సారీ.. తన 92 ఏళ్ల వయసులో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్ కొనసాగుతోంది. 15 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ స్టేషన్ హిమాచల్ప్రదేశ్లోని మండి నియోజకవర్గంలో ఉంది. -
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
చెన్నై నుంచి ముంబయి బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. -
‘వెంటనే ఆ ఫొటో డిలీట్ చేయండి’: నెటిజన్పై ఎస్బీఐ ఆగ్రహం
బ్రాంచ్ ఫొటో తీసి, ఒక వినియోగదారుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఎస్బీఐ(SBI) ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం
ఓ అల్లరి మూక పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని(EVM) చెరువులో విసిరేసిన ఘటన పశ్చిమ బెంగాల్ కుల్తాలీ గ్రామంలో చోటుచేసుకుంది. -
సల్మాన్పై లారెన్స్ బిష్ణోయ్ ట్రిగర్.. పాక్ నుంచి ఏకే-47 తుపాకులు..!
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్పై దాడి చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ పక్కాగా కుట్రలు రచించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ ముఠా సభ్యులు నటుడి కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం. -
శాంపిళ్లు మార్చినట్లు ఆరోపణలు..పుణె కారు ప్రమాద ఘటనలో బాలుడి తల్లి అరెస్టు
పుణె కారు ప్రమాద ఘటన (Pune Car Crash)లో మరో అరెస్టు చోటుచేసుకుంది. కొద్దిరోజుల పాటు జాడలేకుండా పోయిన నిందితుడి తల్లి పోలీసులకు చిక్కారు. -
నాగ్పుర్లో 56 డిగ్రీలు నిజం కాదు.. వాతావరణ శాఖ స్పష్టత
Nagpur Temperature: నాగ్పుర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నిజం కాదని వాతావరణ శాఖ వెల్లడించింది. సెన్సర్ తప్పిదం వల్లే 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు స్పష్టం చేసింది. -
అంచనాల కంటే ముందే వర్షాలు!
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని గురువారం ప్రకటించిన భారత వాతావరణ శాఖ.. అనుకున్న తేదీ కన్నా ముందే పలు ప్రాంతాల్లోకి ఇవి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని తాజాగా వెల్లడించింది. -
నడక.. జపం.. ధ్యానం
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగిస్తున్నారు. రెండోరోజు కార్యక్రమ వీడియోలను భాజపా విడుదల చేసింది. -
రేపు లొంగిపోతా..
ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తిరిగి లొంగిపోనున్నారు. -
భారత్ ఎన్నికల్లో జోక్యానికి ఇజ్రాయెల్ సంస్థ తీవ్ర యత్నం
ఇజ్రాయెల్ కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ... భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యానికి తీవ్ర ప్రయత్నం చేసిందని చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ రాష్ట్ర అవతరణ పదేళ్ల పండుగ సంబురాలకు సర్వం సిద్ధం
-
వెండి తెరపై తళుక్కుమన్న మలాలా యూసఫ్జాయ్
-
బెంగాల్లో భాజపాదే పైచేయి.. ఒడిశాలో నవీన్కు షాక్..!
-
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలపై కేసీఆర్కు గౌరవం లేదు: రేవంత్రెడ్డి
-
రిషభ్ పంత్ అర్ధశతకం.. బంగ్లాదేశ్ టార్గెట్ 183
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్