Anthony Fauci: సంక్షోభ వేళ సైన్యాన్ని దించండి!
కరోనా వైరస్ వల్ల భారత్లో ఏర్పడ్డ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సైన్యాన్ని రంగంలోకి దించడంతోపాటు అన్ని వనరులను వినియోగించుకోవాలని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ స్పష్టం చేశారు.
ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సూచన
వాషింగ్టన్: కరోనా వైరస్ వల్ల భారత్లో ఏర్పడ్డ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సైన్యాన్ని రంగంలోకి దించడంతోపాటు అన్ని వనరులను వినియోగించుకోవాలని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ సూచించారు. వైరస్ ఉద్ధృతి, సదుపాయాల కొరత ఉన్న ప్రాంతాల్లో సైన్యం సహాయంతో తాత్కాలిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కేవలం వైద్య పరికరాలే కాకుండా సిబ్బంది కోసం ఇతర దేశాల సహాయాన్ని భారత్ తీసుకోవాలని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు.
కొన్నివారాల లాక్డౌన్ అవసరం..!
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి తక్షణమే కొన్ని వారాల పాటు పూర్తి లాక్డౌన్ విధించాలని అమెరికా అధ్యక్షునికి ప్రధాన ఆరోగ్య సలహాదారుగా ఉన్న ఆంటోనీ ఫౌచీ పునరుద్ఘాటించారు. చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే వంటి దేశాలు ఈ తరహా నిర్ణయాలతోనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేశాయని అన్నారు. భారత్లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇలా చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో చేయడం వల్ల కరోనా సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయవచ్చని సూచించారు.
సైన్యం సహాయం అవసరమే..
ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు భారత్ తక్షణమే మధ్య, దీర్ఘకాలిక చర్యలు చేపట్టవచ్చని ఫౌచీ పేర్కొన్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైన్యం సహాయంతో క్షేత్రస్థాయిలో ఆసుపత్రులను నిర్మించుకోవాలని సూచించారు. గతేడాది చైనాకు సంక్షోభ సమయం ఎదురైనప్పుడు అత్యంత వేగంగా ఆసుపత్రులను నిర్మించడం, అందుకు అన్ని వనరులను వాడుకున్న సందర్భాన్ని గుర్తుచేశారు. యుద్ధ సమయాల్లో ఏర్పాటు చేసుకునే విధంగా సైన్యం సహకారంతో తాత్కాలిక వైద్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమవుతుందన్నారు. తద్వారా అనారోగ్యంతో ఆసుపత్రి పడకలు అవసరమయ్యే బాధితులకు వైద్య సౌకర్యాలు కల్పించవచ్చని ఫౌచీ సూచించారు.
ప్రపంచ దేశాలు ముందుకు రావాలి..
దేశంలో రోజువారీ కేసుల సంఖ్య మూడున్నర నుంచి నాలుగు లక్షలుగా ఉండడంతో భారత్ భయంకరమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో అమెరికా మాదిరిగానే ఇతర దేశాలు కూడా భారీస్థాయిలో భారత్కు సహాయం అందించేందుకు ముందుకు రావాలని అభిప్రాయపడ్డారు. వైద్యపరికరాలే కాకుండా సిబ్బందిని కూడా పంపించాలని అన్నారు. ప్రస్తుతం భారత్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందనే విషయం అందరికీ స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇలా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా కొద్దీ ప్రతి ఒక్కరి సంరక్షణ చూసుకోవడం ఇబ్బందికరమని.. ఇలాంటి సమయంలో ఆక్సిజన్, వైద్య సదుపాయల కొరత ఏర్పడడం అసాధారణ పరిస్థితులకు దారితీస్తాయని చెప్పారు. అందుచేత సాధ్యమైనంత వరకు సహాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు ఫౌచీ పేర్కొన్నారు.
భారీ స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ అవసరం..
వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు కట్టడికి చర్యలతోపాటే వ్యాక్సినేషన్ను కూడా భారీ స్థాయిలో చేపట్టాలని ఆంటోనీ ఫౌచీ సూచించారు. భారత్లో తయారవుతోన్న రెండు వ్యాక్సిన్లతో పాటే అమెరికా, రష్యా వంటి దేశాలు, వ్యాక్సిన్ సరఫరాకు ముందుకొచ్చే కంపెనీల నుంచి వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని సూచించారు. అయితే, ఈ వ్యాక్సిన్ల వల్ల వచ్చే ఫలితాల్లో మరికొన్ని వారాల్లో కనిపిస్తాయని.. అందువల్ల ప్రస్తుతం ఆసుపత్రుల్లో కొనసాగుతున్న ఆక్సిజన్, చికిత్స భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలన్నారు.
ఇదిలాఉంటే, భారత్లో కరోనా కేసుల సంఖ్య 2కోట్ల మార్కును దాటగా.. 2లక్షల 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే భారత్లో జనాభాలో నాలుగో వంతున్న అమెరికాలో మాత్రం కేసుల సంఖ్య 3.2 కోట్ల మందిలో బయటపడగా, మరణాల సంఖ్య 5లక్షల 77వేలు దాటింది. అయితే, సరిపడ స్థాయిలోలేని ఆరోగ్య మౌలికసదుపాయాలు, బలహీన ఆర్థిక శక్తి, సెకండ్ వేవ్ ప్రభావం వల్ల భారీస్థాయిలో ఇన్ఫెక్షన్ పెరగడం వంటి సమస్యలతో పాటు ఆక్సిజన్, ఐసీయూ పడకల కొరత భారత్ను తీవ్రంగా వేధిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కారు. ఏకంగా 25 కిలోల బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ముంబయిలో చోటుచేసుకున్న ఈ ఘటన అధికారులను షాక్కు గురిచేసింది. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
తన కుమారుడు నామినేషన్ వేసిన సందర్భంగా భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) తన బలాన్ని ప్రదర్శించారు. వేల సంఖ్యలో మద్దతుదారులతో భారీ సభను నిర్వహించారు. -
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
Hamida Banu: ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా? అందులో కన్పిస్తున్న వ్యక్తి భారత మహిళా రెజ్లర్ హమీదా బాను. ఇంతకీ ఎవరామే? ఏంటామె ప్రత్యేకత? -
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
ముందు రాయ్బరేలీలో గెలువు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి తాను చేసిన పోస్టుపై గ్యారీ కాస్పరోవ్ (Garry Kasparov) వివరణ ఇచ్చారు. -
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
కేరళలోని కొచ్చిన్లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది. -
వీఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. -
దిగుతుండగా కూలిన హెలికాప్టర్
శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. -
దిల్లీ మద్యం విధానం కేసులో మరో అరెస్టు
దిల్లీ మద్యం విధానంతో ముడిపడిన నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వినోద్ చౌహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. -
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాలి
మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకొనే లక్ష్యంతో భారతీయ న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సహనమే వివాహబంధానికి పునాది
పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని సుప్రీంకోర్టు పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో... స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. -
కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం
దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
‘ రాహుల్గాంధీ’ పేరుందని పోటీ వద్దంటే ఎలా?
ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై పిటిషన్ను కొట్టేసిన దిల్లీ హైకోర్టు
మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. -
రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వండి
పార్కులో ఉదయపు నడకకు వెళ్లిన వ్యక్తి.. వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించిన ఘటనలో బాధితుడి కుటుంబసభ్యులకు రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. -
ఛత్తీస్గఢ్లో చెట్టును ఢీకొన్న బీఎస్ఎఫ్ సిబ్బంది బస్సు
ఛత్తీస్గఢ్లో సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సు నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 17 మంది సిబ్బంది గాయపడ్డారు. -
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
వివాహితులైన భార్యాభర్తల మధ్యే శారీరక సంబంధాలు ఉండాలన్నది సమాజం నిర్ణయించుకున్న ఆదర్శ నియమమని దిల్లీ హైకోర్టు తెలిపింది. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక ఆరోపణలు
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు అక్కడి రాజ్భవన్లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానిక హరే స్ట్రీట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
దక్షిణ భారత్ దిశగా రాకాసి కెరటాలు..
లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, దక్షిణ తమిళనాడు రాష్ట్రాల వైపు రాకాసి కెరటాలు తరుముకొస్తున్నాయని.. రెండు రోజుల పాటు సముద్రం ఉగ్రరూపం దాల్చనుందని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్కాయిస్) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. -
దేశీయ బాంబర్ డ్రోన్ ఎఫ్డబ్ల్యూడీ-200బి సిద్ధం
రక్షణశాఖ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో బాంబర్ డ్రోన్ను తయారు చేసినట్లు ఫ్లయింగ్ వెడ్జ్ సంస్థ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (7)
మహాత్మాగాంధీ ‘కపటి’ అని గుజరాత్ కాంగ్రెస్ నేత, రాజ్కోట్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్గురు వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆయన కంటే రాహుల్గాంధీ మెరుగని పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!