న్యూ ఇయర్లో కిమ్ చర్య: ఇది చాలా అరుదు..
నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తర కొరియాలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.
రెండున్నర కోట్ల ప్రజలకు లేఖలు
సియోల్: నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తర కొరియాలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఆ దేశ నియంత కిమ్ జాంగ్ ఉన్ కరోనా కష్ట కాలంలో తనను నమ్మి, సహకరిస్తున్నందుకు దేశ ప్రజలకు గతంలో ఎన్నడూ లేని విధంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
‘‘మన దేశ ప్రజల ఆశయాలు, కోరికలు నిజరూపం దాల్చేందుకు, కొత్త శకాన్ని ఆరంభించేందుకు నేను ఈ నూతన సంవత్సరంలో కూడా మరింత కృషి చేస్తాను. క్లిష్ట సమయాల్లో కూడా నాపై తిరుగులేని నమ్మకం ఉంచి, మా పార్టీ వెంట నిలిచిన ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’’ అంటూ కిమ్ కొత్త సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన లేఖల్లో పేర్కొన్నారు. ఈ సందేశంతో కూడిన రెండున్నర కోట్ల లేఖలను ప్రజలకు అందించామని అక్కడి అధికారులు తెలిపారు. సాధారణంగా నూతన సంవత్సరం తొలి రోజు ఈ కొరియా నేత టీవీలో ప్రసంగిస్తారు. ఐతే ఈసారి ఆ సంప్రదాయానికి విరుద్ధంగా తన సందేశాన్ని బహిరంగ లేఖల రూపంలో విడుదల చేయటం గమనార్హం. ఓ ఉత్తర కొరియా నేత ఈ విధంగా సందేశాలను విడుదల చేయటం 1995 తర్వాత ఇదే తొలిసారి.
తమ దేశంలో కరోనా కేసులే లేవని ఉత్తర కొరియా చెబుతున్నప్పటికీ.. అది అసాధ్యమని దక్షణ కొరియా, అమెరికా అంటున్నాయి. అయితే దేశ సరిహద్దుల మూసివేత తదితర కఠిన చర్యల ఫలితంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. కొత్త సంవత్సరం సందర్భంగా కిమ్.. కుంసుసాన్ ప్యాలస్లో ఉండే ఉత్తర కొరియా గత పాలకులైన తన తాత, తండ్రుల స్మారక చిహ్నాలను సందర్శించినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు