మరోసారి పాక్ గుట్టు రట్టయ్యింది!
దాయాది దేశం పాకిస్థాన్ గుట్టు రట్టయ్యింది. ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం లేదన్న అక్కడి ప్రభుత్వం, సైన్యం బుకాయింపు వట్టిదేనని మరోసారి నిరూపితమైంది. అమెరికా మట్టుబెట్టిన అల్ఖైదా కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు.........
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్ గుట్టు రట్టయ్యింది. ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం లేదన్న అక్కడి ప్రభుత్వం, సైన్యం బుకాయింపు వట్టిదేనని మరోసారి నిరూపితమైంది. అమెరికా మట్టుబెట్టిన అల్ఖైదా కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు మధ్య సంబంధాలుండేవని ఓ మాజీ ఉన్నతాధికారి కుండబద్దలు కొట్టారు. షరీఫ్కు లాడెన్ ఆర్థిక సాయం అందజేసేవారని వెల్లడించారు.
‘‘అవును, ఆయన(లాడెన్) నవాజ్ షరీఫ్కు ఓ విషయంలో అండగా నిలిచారు. ఏదేమైనా అదో పెద్ద సంక్లిష్టమైన విషయం. లాడెన్ తరచూ షరీఫ్కు ఆర్థిక సాయం చేసేవారు’’ అంటూ గతంలో అమెరికాలో పనిచేసిన పాకిస్థాన్ రాయబారి అబిదా హుస్సేన్ నిజాన్ని బయటపెట్టారు. ఓ ప్రముఖ ప్రైవేట్ ఛానెల్కు ఇచ్చిన ముఖాముఖిలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. షరీఫ్ హయాంలో అబిదా హుస్సేన్ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
నవాజ్ షరీఫ్పై ఇటీవల అధికార పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్కు చెందిన నేత ఫరూఖ్ అబీబ్ తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశీ విరాళాలకు షరీఫే శ్రీకారం చుట్టారన్నారు. అలా లాడెన్ నుంచి 10 మిలియన్ డాలర్లు తీసుకొని.. అప్పటి బెనజీర్ భుట్టో ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించారన్నారు. దీనిపై అబిదా హుస్సేన్ను తాజాగా ప్రశ్నించగా.. అసలు విషయం బయటపెట్టారు. మూడు దఫాలు పాక్ ప్రధాని బాధ్యతలు నిర్వర్తించిన నవాజ్ షరీఫ్ కశ్మీర్లో జిహాదీ కార్యక్రమాలకు మద్దతిచ్చేవారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు కావాల్సిన నిధులను లాడెన్ నుంచే తీసుకునేవారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా అబిదా చెప్పిన విషయాలతో అవన్నీ నిజమేనన్న విషయం స్పష్టమవుతోంది. ఇక పాక్ ప్రభుత్వంపై సైన్యానిదే పెత్తనం అన్న విషయం తెలిసిందే. అంటే షరీఫ్-లాడెన్ సంబంధాలకు సైన్యం అండ కూడా ఉందనే అర్థం చేసుకోవాలి! దీన్నిబట్టి పాక్ ఉగ్రముఠాలకు అక్కడి ప్రభుత్వం, సైన్యం మద్దతు ఉందని స్పష్టమవుతోంది.
అమెరికాలో డబ్ల్యూటీవో సెంటర్పై దాడిలో ప్రధాన సూత్రధారి అయిన బిన్ లాడెన్ను అమెరికా నేవీ సీల్స్ బృందం 2011, మే నెలలో పాకిస్థాన్ భూభాగంలోనే హతమార్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పాలకులే అతడికి ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రవాదం విషయంలో పాక్ నిజస్వరూపం గతంలోనూ పలు సందర్భాల్లో బయటపడింది. లాడెన్ను ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఏకంగా ఓసారి అమరుడిగా కీర్తించారు. మరో సమయంలో గత ప్రభుత్వాలను విమర్శించే క్రమంలో దాదాపు 30వేల నుంచి 40వేల మంది ఉగ్రవాదులు పాక్లో శిక్షణ పొందుతున్నారని బహిరంగంగా అంగీకరించారు.
ఇక అవినీతి ఆరోపణల కేసులో 2017లో పదవీచ్యుతుడైన నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లండన్లో ఆశ్రయం పొందుతున్నారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అనారోగ్య కారణాలతో గత కొన్ని నెలలగా అక్కడే తలదాచుకుంటున్నారు.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్