Pragati Maidan: దేశంలో అవినీతిపరుల ‘అమృతకాలం’ నడుస్తోంది: రాహుల్‌ గాంధీ

అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ప్రధాని మోదీ ‘ప్లానింగ్‌’తో కాకుండా ‘మోడలింగ్‌’తో ముందుకెళ్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

Updated : 10 Feb 2024 18:31 IST

దిల్లీ: దేశంలో అవినీతిపరుల ‘అమృతకాలం’ నడుస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. దిల్లీలోని ‘ప్రగతి మైదాన్‌ టన్నెల్‌’ లోపాలపై ఓ కథనాన్ని ఉటంకిస్తూ.. ‘ఎక్స్‌’ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘రూ.777 కోట్లతో నిర్మించిన ప్రగతి మైదాన్‌ టన్నెల్‌ (Pragati Maidan Tunnel) ఒక్క ఏడాదిలోనే పనికిరాకుండా పోయింది. అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ప్లానింగ్‌’తో కాకుండా ‘మోడలింగ్‌’తో ముందుకెళ్తున్నారు. మరోవైపు.. ఈడీ, సీబీఐ సంస్థలు అవినీతిపై కాకుండా ప్రజాస్వామ్యంపై పోరాడుతున్నాయి’’ అని ఆరోపించారు.

370 సీట్లు పక్కా.. ఎన్నికలకు ముందే సీఏఏ: అమిత్‌ షా

సెంట్రల్‌ దిల్లీని నగర తూర్పు ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ.. ‘ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్‌’ చేపట్టారు. ఇందులో భాగంగా 1.3 కి.మీ. పొడవైన సొరంగం, ఐదు అండర్‌పాస్‌లు నిర్మించారు. 2022 జూన్‌లో ప్రధాని మోదీ వీటిని ప్రారంభించారు. అయితే, టన్నెల్‌లో నీళ్లు నిలిచిపోవడం, పగుళ్లు రావడం వంటి అనేక లోపాలు వెలుగుచూశాయని.. పనుల్లో జాప్యం, నిర్వహణ లేమీ కారణంగా సమస్యలు తలెత్తినట్లు దిల్లీ ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) పేర్కొంది. రూ.500 కోట్లు జమ చేయాలని, వెంటనే డిజైన్‌ను సరిదిద్దడంతో పాటు మరమ్మతులు ప్రారంభించాలని ‘ఎల్‌ అండ్‌ టీ’కి నోటీసు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని