Rahul Gandhi : పాంగాంగ్‌ సరస్సు వద్ద రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించిన రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi).. తన తండ్రి రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు.

Updated : 20 Aug 2023 11:02 IST

లేహ్‌: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ(Rajiv Gandhi) 79వ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఆయనకు నివాళులు అర్పించారు. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లోని లేహ్‌లో పర్యటిస్తున్న రాహుల్‌.. భారత్‌-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్‌ సరస్సు (Pangong Lake)కు శనివారం మోటార్‌ సైకిల్‌ యాత్ర చేపట్టారు. రాత్రి  పాంగాంగ్‌ సరస్సు వద్ద ఉన్న టూరిస్ట్‌ క్యాంప్‌లో బస చేశారు. ఆదివారం రాజీవ్‌ గాంధీ జయంతిని ఈ సరస్సు వద్దే రాహుల్‌ గాంధీ నిర్వహించారు. గతంలో రాజీవ్‌ గాంధీ భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో తీసిన ఫొటోలను ఎక్స్‌ ( ప్రస్తుతం ట్విటర్‌)లో రాహుల్‌ షేర్‌ చేశారు. ‘‘పాపా (నాన్న).. భారత్‌ కోసం మీరు కన్న కలలను వెలకట్టలేని ఈ జ్ఞాపకాలు తెలియజేస్తున్నాయి. మీరు చూపిన మార్గంలోనే నడుస్తూ.. ప్రతి భారతీయుడి కష్టాలను అర్థం చేసుకుంటూ, భరతమాత గొంతును వింటున్నాను’’ అని రాజీవ్‌ గాంధీ తీసిన ఫొటోలకు సంబంధించిన వీడియోను రాహుల్‌ ట్వీట్ చేశారు. 

ఇక దేశ రాజధాని దిల్లీలో రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ,  కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తదితరులు నివాళులర్పించారు.

జాబిల్లికి అడుగు దూరంలో విక్రమ్‌..

ఆగస్టు 25 వరకూ లేహ్‌లో పర్యటించనున్న రాహుల్‌ గాంధీ.. అక్కడ జరిగే ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను కూడా వీక్షిస్తారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ - కార్గిల్‌ ప్రాంతంలో కౌన్సిల్‌ ఎన్నికలు సెప్టెంబర్ 10న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలువురితో రాహుల్‌ భేటీ కానున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని