2020లో దేశీయ విమాన ప్రయాణికులు@ 6.3 కోట్లు
గతేడాది దేశీయంగా 6.3కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది. విమాన ప్రయాణికుల సంఖ్య 2019తో పోలిస్తే 56.29శాతం తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. 2020లో కరోనా, లాక్డౌన్ ప్రభావం విమానయాన రంగంపై
దిల్లీ: గతేడాది దేశీయ విమానాల్లో 6.3కోట్ల మంది ప్రయాణించారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది. విమాన ప్రయాణికుల సంఖ్య 2019తో పోలిస్తే 56.29శాతం తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. 2020లో కరోనా, లాక్డౌన్ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపాయన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి దృష్ట్యా మొదట దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలను కేంద్రం నిలిపివేసింది. ఆ తర్వాత అన్లాక్లో భాగంగా నిర్దేశించిన అంతర్జాతీయ, దేశీయ విమాన సేవలను పునఃప్రారంభించింది. అయినా, ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు డీజీసీఏ లెక్కలు చెబుతున్నాయి.
2020లో దేశీయ విమానయానంలో ఇండిగో సింహాభాగం సేవలందించింది. ఈ సంస్థ విమానాల్లో 3.25 కోట్ల మంది ప్రయాణించారు. అంటే మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల్లో 51.7శాతం. స్పైస్జెట్ విమానాల్లో 93.9లక్షల మంది ప్రయాణించారు. ఇది మొత్తం ప్రయాణికుల్లో 14.9శాతంగా ఉంది. ఇక ఎయిర్ ఇండియాలో 69.32లక్షలు, గోఎయిర్లో 54.38లక్షలు, ఎయిర్ ఏషియా ఇండియాలో 43.87లక్షలు, విస్తారాలో 39.39లక్షల మంది విమానయానం చేశారు. గత డిసెంబర్లో మొత్తం 73.27లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. ఇది 2019తో పోలిస్తే 43.72శాతం తక్కువ. అయితే, పర్యటక సీజన్ ముగియడంతోనే డిసెంబర్లో ప్రయాణికుల సంఖ్య తగ్గినట్లు డీజీసీఏ చెబుతోంది.
తొలిస్థానంలో ఇండిగో
గత డిసెంబర్లో అన్ని విమానాల్లో ఆక్యుపెన్సీ రేట్ 65.1 శాతం నుంచి 78 శాతం ఉన్నట్లు డీజీసీఏ తెలిపింది. అత్యధికంగా స్పైస్జెట్లో 78శాతం ఆక్యూపెన్సీ ఉందని పేర్కొంది. బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్, ముంబయి నగరాల్లో ఇండిగో సంస్థ ఉత్తమ సేవలు అందించి తొలిస్థానంలో నిలిచినట్లు డీజీసీఏ వెల్లడించింది. తర్వాతి రెండు స్థానాల్లో ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారా నిలిచాయి.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం