Railway: స్పెషల్‌ రైళ్లు ఆపేసి.. టికెట్‌ ధర తగ్గిస్తాం: రైల్వేశాఖ మంత్రి

రైలు ప్రయాణికులను రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 30శాతం అధిక ధరతో నడుస్తోన్న స్పెషల్‌ రైళ్లను త్వరలో రద్దు చేసి తిరిగి రెగ్యులర్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురాన్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. కరోనా.. లాక్‌డౌన్‌ సమయంలో పెంచిన ధరను కూడా తగ్గించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు

Updated : 12 Nov 2021 18:55 IST

భువనేశ్వర్‌: రైలు ప్రయాణికులను రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 30శాతం అధిక ధరతో నడుస్తోన్న స్పెషల్‌ రైళ్లను త్వరలో రద్దు చేసి తిరిగి రెగ్యులర్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. ఒడిశాలో పర్యటిస్తూ తాజాగా ఈ ప్రకటన చేశారు. కరోనా.. లాక్‌డౌన్‌ సమయంలో పెంచిన టికెట్‌ ధరలను కూడా తగ్గించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

కరోనాకు ముందు నిత్యం 1700 మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 3,500 ప్యాసింజర్‌ రైళ్లు నడిచేవి. కరోనా కారణంగా విధించిన ఆంక్షలతో రైల్వే సేవలు నిలిచిపోయాయి. అయితే, కరోనా తీవ్రత తగ్గుతుండటంతో.. ప్రజల ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపించడం ప్రారంభించింది. ప్రస్తుతం మెయిల్‌ రైళ్లలో 95శాతం రైళ్లు అందుబాటులో ఉండగా.. 25 శాతం రైళ్లు ప్రత్యేక కేటగిరిలో సేవలు అందిస్తున్నాయి. ఇక ప్యాసింజర్‌ రైళ్లలో వెయ్యి మాత్రమే నడుస్తున్నాయి. వాటిలోనూ 70శాతానికిపైగా ప్యాసింజర్‌ రైళ్లకు మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ హోదా ఇచ్చి.. ఆ మేరకే టికెట్‌ ధర వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఆదేశాలను రద్దు చేయబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. రెండు నెలల్లో టికెట్‌ ధర తగ్గడంతోపాటు రైల్వే సేవలు మొత్తం సాధారణ స్థితికి వస్తాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని