UNESCO: మోస్ట్ సెర్చ్ జాబితాలో తాజ్మహల్ నంబర్ వన్.. మిగతా వారసత్వ ప్రదేశాలు ఇవే
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటైన ‘తాజ్మహల్’కు విశేష గుర్తింపు దక్కింది. ప్రముఖ ట్రావెల్ వెబ్సైట్ ‘జిటాంగో’ వివరాల ప్రకారం.. మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో అత్యధికంగా శోధించిన వారసత్వ సంపదల జాబితాలో...
ఇంటర్నెట్ డెస్క్: యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటైన ‘తాజ్మహల్’కు విశేష గుర్తింపు దక్కింది. ప్రముఖ ట్రావెల్ వెబ్సైట్ ‘జిటాంగో’ వివరాల ప్రకారం.. మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో అత్యధికంగా శోధించిన వారసత్వ సంపదల జాబితాలో ఈ పాలరాతి స్మారక కట్టడం మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఒకే నెలలో దాదాపు 14 లక్షలకుపైగా ఈ నిర్మాణం గురించి ఆన్లైన్లో వెతికారు. మొఘలుల నిర్మాణ శైలికి గొప్ప ఉదాహరణగా నిలిచే ఈ కట్టడాన్ని.. షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం ఆగ్రాలో నిర్మించాడు. ప్రపంచ ఏడు వింతల్లో ఇదీ ఒకటి. ఇదిలా ఉండగా.. యునెస్కో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1,154 ప్రదేశాలను వారసత్వ సంపదగా గుర్తించింది.
పెరూ దేశంలోని మాచు పిచ్చు రెండో స్థానంలో నిలిచింది. దీనికి దాదాపు 11 లక్షల సెర్చ్లు నమోదయ్యాయి. అండీస్ పర్వతాల్లో నది లోయపైన సముద్ర మట్టానికి 7900 అడుగులకుపైగా ఎత్తులో నిర్మించిన కోట ఇది. 15వ శతాబ్దంలో కట్టినట్లు భావిస్తారు. అడుసు ఉపయోగించకుండా రాతి గోడలను నిర్మించడం గమనార్హం.
82 వేలకు పైగా శోధనలతో మూడో స్థానంలో బ్రెజిల్లోని రియో డి జనిరో ఉంది. దేశంలో రెండో అత్యధిక జనాభా కలిగిన నగరం ఇది. 2012లో ఇందులో కొంతభాగాన్ని యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఏడు వింతల్లో ఒకటైన ‘క్రైస్ట్ ది రిడీమర్’ విగ్రహం ఇక్కడే ఉంది.
అమెరికాలోని ఎల్లోస్టోన్ పార్క్ ఓ జాతీయ ఉద్యానవనం. దీని గుండా ఎల్లోస్టోన్ నది పారుతుండటంతో.. ఆ పేరు వచ్చింది. వేడి నీటి బుగ్గల(హాట్ స్ప్రింగ్స్)కు పేరొందిన ప్రదేశం. అనేక జీవజంతుజాలానికి నెలవు ఈ పార్కు. 79 వేల సెర్చ్లు నమోదయ్యాయి.
ఇంగ్లాండ్ విల్ట్షైర్లోని సాలిస్బరీ మైదాన ప్రాంతంలో నెలవైన కట్టడం ‘స్టోన్హెంజ్’. బ్రిటన్ సాంస్కృతిక చిహ్నం ఇది. రింగ్ ఆకృతిలో నిటారుగా నిలబెట్టిన పొడవైన భారీ రాళ్లు, వాటిపై అడ్డంగా పేర్చిన రాతి పలకలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. బ్లూస్టోన్స్తో లోపల మరో రింగ్, ఇతర నిర్మాణాలు ఉంటాయి. క్రీ.పూ 3000 నుంచి క్రీ.పూ 2000 వరకు వరకు దీని నిర్మాణం సాగినట్లు సమాచారం. 78 వేలకుపైగా దీని గురించి వెతికారు.
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి నెట్టింట 75 వేలసార్లకుపైగా వెతికారు. అమెరికా న్యూయార్క్లోని లిబర్టీ ఐలాండ్ ఉంటుందిదీ. చేతిలో కాగడాను పట్టుకుని ఠీవీగా కనిపించే ఈ 151 అడుగుల విగ్రహాన్ని.. ఫ్రాన్స్ అమెరికాకి బహుమతిగా ఇచ్చింది. వాస్తవానికిది రోమన్ దేవత. దీన్ని స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలకు గుర్తుగా భావిస్తారు.
57 వేలకుపైగా సెర్చ్లతో పెట్రా నగరం ఏడో స్థానంలో నిలిచింది. జోర్డాన్ దేశంలోని ఓ పురాతన నగరం ఇది. అద్భుతమైన రాక్-కట్ ఆర్కిటెక్చర్, ఎడారి ప్రాంతంలోనూ ప్రత్యేక నీటి నిర్వహణ వ్యవస్థ దీని సొంతం. అప్పట్లో ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రంగా అలరారినట్లు చరిత్ర చెబుతోంది. 1985లో యునెస్కో గుర్తింపు దక్కింది.
వాయువ్య ఇటలీలోని ఓ తీర ప్రాంతం ‘సిన్క్యూ టెర్రే’. సిన్క్యూ టెర్రే.. అంటే ఐదు ప్రాంతాల సముదాయం అని అర్థం. మోంటెరోసో అల్ మేర్, వెర్నాజ్జా, కార్నిగ్లియా, మనరోలా, రియోమాగ్గియోర్ గ్రామాలు కలిసి ఉంటాయి. కఠిన శిఖర ప్రాంతాల్లో ఏటవాలుగా నిర్మించిన ఇళ్లు, సన్నని దారులు ముచ్చటగొల్పుతాయి. 55 వేలసార్లు దీని గురించి సెర్చ్ చేశారు.
ఫ్రాన్స్లోని వెర్సైల్స్ ప్యాలెస్.. మాజీ రాజ నివాసం. పారిస్కు 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్యాలెస్ ఫ్రెంచ్ రిపబ్లిక్ యాజమాన్యంలో ఉంది. 1995 నుంచి దేశ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఏటా 1.50 కోట్ల మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తారు. ఈ కట్టడం విషయంలో 46 వేలకుపైగా శోధనలు నమోదయ్యాయి.
మెక్సికోలోని చిచెన్ ఇట్జా నగరం.. మాయన్ నాగరికత కాలం నాటిది. టెంపుల్ ఆఫ్ కుకుల్కాన్గా పేరొందిన ఓ పిరమిడ్ నిర్మాణం.. ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. 44 వేలకుపైగా సెర్చ్లతో పదో స్థానంలో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కారు. ఏకంగా 25 కిలోల బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ముంబయిలో చోటుచేసుకున్న ఈ ఘటన అధికారులను షాక్కు గురిచేసింది. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
తన కుమారుడు నామినేషన్ వేసిన సందర్భంగా భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) తన బలాన్ని ప్రదర్శించారు. వేల సంఖ్యలో మద్దతుదారులతో భారీ సభను నిర్వహించారు. -
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
Hamida Banu: ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా? అందులో కన్పిస్తున్న వ్యక్తి భారత మహిళా రెజ్లర్ హమీదా బాను. ఇంతకీ ఎవరామే? ఏంటామె ప్రత్యేకత? -
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
ముందు రాయ్బరేలీలో గెలువు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి తాను చేసిన పోస్టుపై గ్యారీ కాస్పరోవ్ (Garry Kasparov) వివరణ ఇచ్చారు. -
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
కేరళలోని కొచ్చిన్లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది. -
వీఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. -
దిగుతుండగా కూలిన హెలికాప్టర్
శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. -
దిల్లీ మద్యం విధానం కేసులో మరో అరెస్టు
దిల్లీ మద్యం విధానంతో ముడిపడిన నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వినోద్ చౌహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. -
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాలి
మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకొనే లక్ష్యంతో భారతీయ న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సహనమే వివాహబంధానికి పునాది
పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని సుప్రీంకోర్టు పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో... స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. -
కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం
దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
‘ రాహుల్గాంధీ’ పేరుందని పోటీ వద్దంటే ఎలా?
ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై పిటిషన్ను కొట్టేసిన దిల్లీ హైకోర్టు
మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. -
రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వండి
పార్కులో ఉదయపు నడకకు వెళ్లిన వ్యక్తి.. వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించిన ఘటనలో బాధితుడి కుటుంబసభ్యులకు రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. -
ఛత్తీస్గఢ్లో చెట్టును ఢీకొన్న బీఎస్ఎఫ్ సిబ్బంది బస్సు
ఛత్తీస్గఢ్లో సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సు నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 17 మంది సిబ్బంది గాయపడ్డారు. -
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
వివాహితులైన భార్యాభర్తల మధ్యే శారీరక సంబంధాలు ఉండాలన్నది సమాజం నిర్ణయించుకున్న ఆదర్శ నియమమని దిల్లీ హైకోర్టు తెలిపింది. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక ఆరోపణలు
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు అక్కడి రాజ్భవన్లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానిక హరే స్ట్రీట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
దక్షిణ భారత్ దిశగా రాకాసి కెరటాలు..
లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, దక్షిణ తమిళనాడు రాష్ట్రాల వైపు రాకాసి కెరటాలు తరుముకొస్తున్నాయని.. రెండు రోజుల పాటు సముద్రం ఉగ్రరూపం దాల్చనుందని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్కాయిస్) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. -
దేశీయ బాంబర్ డ్రోన్ ఎఫ్డబ్ల్యూడీ-200బి సిద్ధం
రక్షణశాఖ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో బాంబర్ డ్రోన్ను తయారు చేసినట్లు ఫ్లయింగ్ వెడ్జ్ సంస్థ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (7)
మహాత్మాగాంధీ ‘కపటి’ అని గుజరాత్ కాంగ్రెస్ నేత, రాజ్కోట్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్గురు వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆయన కంటే రాహుల్గాంధీ మెరుగని పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్