కొవిడ్ పాజిటివ్ వస్తే.. చుట్టూ 25 మీటర్లు సీల్
కరోనా వైరస్ కట్టడికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసిన యూపీ ప్రభుత్వం
లఖ్నవూ: కరోనా వైరస్ కట్టడికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పాజిటివ్గా తేలిన వ్యక్తి నివసిస్తోన్న ఇంటి చుట్టూ 25 మీటర్ల ప్రాంతాన్ని సీల్ చేయాలని పేర్కొంది. ఒకవేళ అదే ప్రాంతంలో మరోవ్యక్తికి కూడా వైరస్ సోకితే, సీల్ చేసే ప్రాంతం పరిధి 50 మీటర్లకు పెరుగుతుంది. ఆ మార్గదర్శకాల ప్రకారం 25 మీటర్ల పరిధిలోకి కనీసం 20 ఇళ్లు, 50 మీటర్ల పరిధిలోకి 60 ఇళ్లు వస్తాయని పేర్కొంది.
అలాగే చివరి పాజిటివ్ కేసు వెలుగు చూసిన దగ్గరి నుంచి 14 రోజుల పాటు ఆ ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్గా పరిగణిస్తారు. ఆ కాలంలో ఒక్క కేసు కూడా లేకపోతే ఆ ప్రాంతం కంటైన్మెంట్ జోన్ నుంచి బయట పడుతుంది. జిల్లా నిఘా అధికారి ఇచ్చే రోజువారీ కొవిడ్ సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లో పర్యటించే బృందం కరోనా నివారణ చర్యల గురించి ఆ ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ, లక్షణాలు ఉన్న వారి వివరాలను జిల్లా నిఘా అధికారికి నివేదిస్తుంది. అక్కడి నుంచి ఆ రాష్ట్ర వైద్య సిబ్బందికి సమాచారం వెళుతుంది. అయితే ఉత్తర ప్రదేశ్లో తాజాగా 4,136 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇంతవరకూ మొత్తం కేసుల సంఖ్య 6,30,059కి, మరణాల సంఖ్య 8,881కి చేరుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు