UP Polls: ఉత్తర్ప్రదేశ్లో ముగిసిన తొలిదశ.. 59శాతం ఓటింగ్ నమోదు!
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 11 జిల్లాల పరిధిలోని మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయ్యింది. సాయంత్రం 6గంటల సమయానికి దాదాపు 59శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్న కేంద్ర ఎన్నికల సంఘం
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 11 జిల్లాల పరిధిలోని మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయ్యింది. సాయంత్రం 6గంటల సమయానికి దాదాపు 59శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ మొత్తంగా తొలిదశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు పేర్కొంది. ఈ దశలో మొత్తం 25,880 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగగా.. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా 138 పింక్ బూత్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
షామ్లి, హాపూర్, గౌతమ్బుద్ధనగర్, ముజఫర్నగర్, మేరఠ్, బాగ్పత్, ఘజియాబాద్, బులంద్షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాల్లో గురువారం తొలిదశ పోలింగ్ జరిగింది. ఈ జిల్లాలోని 58 అసెంబ్లీ స్థానాలకు 12 స్థానాలను సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. మొదటి విడతలో భాగంగా లక్షమంది పోలీసుల సిబ్బంది, హోంగార్డులు విధుల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరితోపాటు మరో 800 కంపెనీల కేంద్ర బలగాలను విధుల్లో పాల్గొన్నాయని తెలిపారు. ఒక్కో కంపెనీలో 70-80 మంది సిబ్బంది ఉన్నట్లు వివరించారు.
తొలివిడతలో మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో అధికార భాజపా ప్రభుత్వంలోని ఎనిమిది మంది మంత్రులు ఉండగా.. వారి భవిష్యత్తు ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యింది. తొలిదశలో మొత్తంగా 2.27కోట్ల మంది ఓటర్లు పాల్గొనాల్సి ఉండగా.. వీరిలో దాదాపు 60శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇదిలాఉంటే, తొలిదశ పోలింగ్ జరిగిన ప్రాంతంలో గత ఎన్నికల్లో (2017లో) అత్యధిక స్థానాలు భాజపానే గెలుచుకుంది. 58 స్థానాలకు గానూ 53 సీట్లలో భాజపా గెలువగా, ఎస్పీ, బీఎస్పీలు చెరో రెండు సీట్లు గెలుచుకున్నాయి. మరోస్థానంలో ఆర్ఎల్డీ విజయం సాధించింది. ఈసారి మాత్రం ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని సమాజ్వాదీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల