విచారణలో దీపిక కన్నీరు..!
మాదకద్రవ్యాలు సేవిస్తున్నారనే ఆరోపణలతో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్తోపాటు దీపిక మేనేజర్ కరీష్మా ప్రకాశ్ శనివారం ఎన్సీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సుమారు ఐదుగంటలపాటు సాగిన విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దీపిక కన్నీరు పెట్టుకున్నారట...
రకుల్, సారా, శ్రద్ధాకపూర్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు
ముంబయి: మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటులు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్తోపాటు దీపిక మేనేజర్ కరీష్మా ప్రకాశ్ శనివారం ఎన్సీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సుమారు ఐదుగంటలపాటు సాగిన విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దీపిక కన్నీరు పెట్టుకున్నారట. అయితే ఇలా ప్రతీదానికి కన్నీరుపెట్టుకోవడంతో.. అధికారులు అసహనానికి గురయ్యారని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఎమోషనల్ డ్రామాని కట్టిపెట్టి సమాధానం చెప్పమని అధికారులు ఆమెతో అన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయాసాహా సెల్ఫోన్ నుంచి బహిర్గతమైన వాట్సాప్ చాట్ తనదేనని.. కానీ తాను డ్రగ్స్ తీసుకోలేదని ఆమె అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.
సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడు..!
నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మత్తుపదార్థాలు తీసుకునేవాడని, షూటింగ్ సమయంలో క్యారావ్యాన్లోకి వెళ్లి మాదకద్రవ్యాలను సేవించేవాడని నటి శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ ఎన్సీబీ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘కేదార్నాథ్’ సినిమా సమయంలో సుశాంత్తో సన్నిహితంగా ఉన్నానని.. అప్పుడప్పుడు అతని ఫామ్హౌస్లో జరిగే పార్టీలకు వెళ్లానని.. కానీ ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని సారా విచారణలో వివరించారని పలు వెబ్సైట్లలో కథనాలు వచ్చాయి.
ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు
డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ అధికారులు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధాకపూర్, దీపిక మేనేజర్ కరీష్మా ప్రకాశ్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ఎన్సీబీ అధికారి అశోక్ జైన్ మాట్లాడుతూ.. ‘డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా పలువురు నటీమణుల్ని విచారించాం. వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. సదరు రికార్డ్లను కోర్టుకి అందజేస్తాం. అలాగే వాళ్ల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. సదరు నటీమణులు చెప్పింది నిజమా? కాదా?అని తెలుసుకోవడం కోసం సెల్ఫోన్ చాట్స్ పరిశీలిస్తాం’ అని వెల్లడించారు.
కరణ్ పార్టీ పరిశీలనలో లేదు
2019లో పలువురు బీటౌన్ సెలబ్రిటీలకు ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్జోహార్ తన నివాసంలో ఓ పార్టీ ఇచ్చారు. అయితే ఆ పార్టీలో నటీనటులు డ్రగ్స్ తీసుకున్నారని పేర్కొంటూ కొంతమంది నెటిజన్లు ఆరోపణలు చేశారు. దీంతో సదరు పార్టీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. తాజాగా ఈ వీడియో గురించి ఎన్సీబీ అధికారి అశోక్ జైన్ స్పందించారు. ఇప్పటివరకూ కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీ తమ పరిశీలనలో లేదన్నారు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసుకు.. కరణ్ పార్టీకీ ఎలాంటి సంబంధం లేదన్నారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ముంబయిలోని తన నివాసంలో జూన్ 14న మృతిచెంది కనిపించారు. సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సదరు నటుడి ప్రియురాలు రియా చక్రవర్తిని విచారణ చేశారు. అనంతరం ఈ కేసుని అధికారులు డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్తోపాటు పలువురు డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 6వ తేదీ వరకూ రియాకి కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం