మాటలు రావడం లేదు: భారతీరాజా

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని

Published : 25 Sep 2020 13:08 IST

చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. దర్శకుడు భారతీ రాజా కూడా ఎస్పీ బాలు ఆరోగ్యంపై స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

‘‘కొన్ని పరిస్థితుల్లో ఏమీ మాట్లాడలేము.  ఈ బాధను ఎలా పంచుకోవాలో తెలియడం లేదు. మాతో సహా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ ఆయన కోలుకోవాలని ప్రార్థించాం. ఆ ప్రార్థనలు, వేడుకోళ్లు దేవుడు ఆలకించినట్లు లేడు. ప్రకృతిని జయించడం మనిషి వల్ల కాలేదు. మన పది రోజుల ప్రార్థనలు ఆయన ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచాయి. ఇప్పటికీ ఆయన కోలుకుంటారని నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు.

మరోవైపు ఎస్పీబీ కుటుంబ సభ్యులందరూ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుంటున్నారు. భారతీరాజా కూడా అక్కడే ఉన్నారు. బాలు కుటుంబ సభ్యులతో సీనియర్‌ పోలీస్‌ అధికారులు మాట్లాడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని