సెలబ్రిటీల పార్టీ వీడియో వైరల్.. కరణ్ ప్రకటన
బాలీవుడ్-డ్రగ్ కేసులో దర్శక, నిర్మాత కరణ్ జోహార్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారించబోతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. 2019లో ఆయన బాలీవుడ్ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన పార్టీ గురించి ప్రశ్నించబోతున్నారని....
ముంబయి: బాలీవుడ్-డ్రగ్ కేసులో దర్శక, నిర్మాత కరణ్ జోహార్ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారించబోతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. 2019లో ఆయన బాలీవుడ్ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన పార్టీ గురించి ప్రశ్నించబోతున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై కరణ్ తాజాగా స్పందించారు. తనపై మీడియా రాస్తున్న కథనాల్ని ఖండించారు. తనెప్పుడూ మాదక ద్రవ్యాల్ని ఏ రూపంలోనూ తీసుకోలేదని, ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు.
‘కొన్ని న్యూస్ ఛానళ్లు, పత్రికలు, వెబ్సైట్లు, సోషల్మీడియా ప్లాట్ఫాంలు తప్పుగా రిపోర్టింగ్ చేస్తున్నాయి. 2019 జులై 28న నేను మా ఇంట్లో ఇచ్చిన పార్టీలో ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారని పేర్కొంటున్నాయి. 2019లోనే ఆ వైరల్ వీడియోపై నేను స్పష్టత ఇచ్చా, నాపై వచ్చిన ఆరోపణలు నిజం కాదు. ఇప్పుడు డ్రగ్పై విచారణ జరుగుతున్న క్రమంలో వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవాస్తవాలని నేను పునరుద్ఘాటిస్తున్నాను. ఆ రోజు పార్టీలో ఎటువంటి మాదక ద్రవ్యాల్ని ఉపయోగించలేదు. మరోసారి చెబుతున్నా.. నేను ఎటువంటి డ్రగ్ను సేవించలేదు, తీసుకునే వారిని ప్రోత్సహించలేదు. ఈ హానికరమైన మీడియా కథనాలు అనవసరంగా నా పేరు, నా సహ ఆర్టిస్టులు, ధర్మా ప్రొడక్షన్స్ పేరును ప్రస్తావించి.. బాధిస్తున్నాయి’ అని కరణ్ ప్రకటనలో పేర్కొన్నారు.
అనంతర ధర్మా ప్రొడక్షన్స్కు చెందిన క్షితిజ్ రవి ప్రసాద్, అనుభవ్ చోప్రాలను పోలీసులు విచారిస్తున్నారని వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ.. ‘క్షితిజ్ రవి ప్రసాద్, అనుభవ్ చోప్రా నా దగ్గర పనిచేసే వాళ్లని కొందరు రాశారు. వీరిద్దరు నాకు వ్యక్తిగతంగా తెలియదు. ప్రజలు తమ వ్యక్తిగత జీవితంలో చేసే పనులకు నేను, ధర్మా ప్రొడక్షన్స్ బాధ్యులం కాదు. వీరిపై వస్తున్న ఆరోపణలకు మాకు ఎటువంటి సంబంధం లేదు. అనుభవ్ చోప్రా మా ఉద్యోగి కాదు.. 2011 నవంబరు నుంచి 2012 జనవరి మధ్య కాలంలో మేం తీసిన ఓ చిత్రానికి రెండో సహాయ దర్శకుడిగా పనిచేశారు. 2013లో ఓ లఘు చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత అతడు ధర్మా ప్రొడక్షన్స్తో కలిసి ఎప్పుడూ పనిచేయలేదు. క్షితిజ్ రవి ప్రసాద్ మా సంస్థకు అనుసంధాన సంస్థ అయిన ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్లో ఓ ప్రాజెక్టు కోసం ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఒప్పందంపై 2019 నవంబరులో చేరారు. కానీ ఇంత వరకు ఆ ప్రాజెక్టును మేం ప్రారంభించలేదు’.
‘ఏదేమైనప్పటికీ గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు, తప్పుడు ఆరోపణలు మమ్మల్ని ఎంతో బాధిస్తున్నాయి. సమాచారాన్ని పరిశీలించి ప్రచురించాలని నేను మీడియాను కోరుతున్నా. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా’ అని ముగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి