క్యాబేజీ డ్రెస్లో ‘కెవ్వుకేక’ భామ
హీరోయిన్లు అందరిని దృష్టిని ఆకర్షించేందుకు వినూత్నంగా ఫొటోషూట్లు చేస్తుంటారు. అది బాలీవుడ్లో అయితే.. వినూత్నం కాస్త వింతకు దారితీస్తుంది. కొంతకాలం క్రితం బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ ఆకులు అడ్డుపెట్టుకొని చేసిన ఫొటోషూట్ గుర్తుందిగా..
ముంబయి: హీరోయిన్లు అందరి దృష్టిని ఆకర్షించేందుకు వినూత్నంగా ఫొటోషూట్లు చేస్తుంటారు. అది బాలీవుడ్లో అయితే.. వినూత్నం కాస్త వింతకు దారితీస్తుంది. కొంతకాలం క్రితం బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ ఆకులు అడ్డుపెట్టుకొని చేసిన ఫొటోషూట్ గుర్తుందిగా.. మరీ అంతలా కాకున్నా.. అలాంటి ప్రయత్నమే చేసింది మరో భామ. ‘గబ్బర్సింగ్’లో వపర్స్టార్తో కలిసి కెవ్వుకేక అంటూ చిందేసిన బాలీవుడ్ నటి మలైకా అరోడా గుర్తుందిగా. ఆమె చేసిన ఫొటోషూట్లోని ఒక ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అయింది. ఆ ఫొటోను ట్రోల్ చేస్తూ నెటిజన్లు ఆమెపై జోకులు వేసుకుంటున్నారు.
ఫొటోషూట్లో భాగంగా మలైకా ఒక ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ‘ఉష్ణమండల స్వర్గం’ అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది. అందులో ఆమె ధరించిన ఆకుపచ్చ దుస్తుల గురించి జోరుగా చర్చ సాగుతోంది. ‘గ్రీన్ క్యాబేజీ’ అంటూ ఒకరు స్పందించగా.. కాదుకాదు.. ‘గోబీ డ్రెస్’ అంటూ మరొకరు స్పందిస్తున్నారు. ఇంకొంతమందేమో.. గత ఏడాది డబ్బూ రత్నాని తీసిన క్యాలండర్ ఫొటో షూట్కు ఈ ఫొటో ఏమాత్రం తీసిపోదని అంటూ ఉందని అప్పటి కియారా ఫొటోను గుర్తు చేసుకుంటున్నారు. కాగా.. తన ప్రియుడు అర్జున్కపూర్తో కలిసి నూతన సంవత్సర వేడుకల కోసం గోవాకు వెళ్లినట్లు వస్తున్న వార్తలకు ఆమె చేసిన తాజా పోస్టు మరింత బలం చేకూర్చింది.
మలైకా టాలీవుడ్లోనూ కొన్ని ఐటమ్ సాంగ్స్కు చిందేసింది. గబ్బర్సింగ్లో ‘కెవ్వుకేక’, అతిథి సినిమాలో ‘రాత్రయినా నాకూ ఓకే.. పగలైతే డబలోకే’ అంటూ తెలుగు ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. బాలీవుడ్లో ఓం శాంతి ఓం, హౌస్ఫుల్, దబాంగ్ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం ఆమె బుల్లితెరకే పరిమితమైంది.
ఇదీ చదవండి..
‘వావ్’ ఓజా.. జ్వాల.. ద్రోణవల్లి హారిక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.