కాజల్ పెళ్లి కోసం ఎంతోకాలంగా వెయిటింగ్
మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ చందమామ కాజల్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె అక్టోబరు 30న తన ప్రియుడు గౌతమ్ కిచ్లును మనువాడనున్నారు. అక్టోబరు 29న హల్దీ (పసుపు కొట్టడం), మెహెందీ వేడుకల్ని నిర్వహించబోతున్నామని కాజల్ సోదరి, నటి నిషా అగర్వాల్ మీడియాకు తెలిపారు.....
ఇంట్లోనే హల్దీ, మెహందీ వేడుకలు: నిషా అగర్వాల్
ముంబయి: మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ చందమామ కాజల్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె అక్టోబరు 30న తన ప్రియుడు గౌతమ్ కిచ్లును మనువాడనున్నారు. అక్టోబరు 29న హల్దీ (పసుపు కొట్టడం), మెహెందీ వేడుకల్ని నిర్వహించబోతున్నామని కాజల్ సోదరి, నటి నిషా అగర్వాల్ మీడియాకు తెలిపారు. ఈ పెళ్లి కోసం తమ కుటుంబం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.
‘కరోనా వైరస్ నేపథ్యంలో పెళ్లి వేడుకల్ని నిడారంబరంగా జరుపుతున్నాం. ఆంక్షలు ఉన్నప్పటికీ వాటిని పాటిస్తూ.. సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సంప్రదాయం ప్రకారం హల్దీ, మెహెందీ వేడుకల్ని ఇంట్లోనే నిర్వహిస్తున్నాం. ఈ రెండు పెళ్లికి ముందు రోజు (అక్టోబరు 29) జరుగుతాయి. కాజల్ తన జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతోంది.. మేమంతా చాలా ఉత్సుకతగా ఉన్నాం’.
‘ఇది మా కుటుంబానికి భావోద్వేగంతో కూడుకున్న సమయం. కాజల్ పెళ్లి కోసం మా తండ్రి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఇది మాకు ప్రత్యేకమైన రోజు. మరోపక్క కాజల్ వివాహం చేసుకుని, ఇంటి నుంచి వెళ్లిపోతుండటం మమ్మల్ని బాధిస్తోంది. ఇప్పుడు వీలైనంత సమయం అక్కతో గడిపేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో అందరూ పెళ్లి కుమార్తెతో మాట్లాడాలని, ఉండాలని అనుకుంటారు. కాబట్టి నాకు అక్కతో గడిపేందుకు ఎక్కువ సమయం దొరకడం లేదు’ అని ఆమె అన్నారు.
వివాహం ఎక్కడ జరగబోతోందనే విషయాన్ని మాత్రం నిషా వెల్లడించలేదు. ‘కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరు కాబోతున్నారు. ఈ వివాహం ఎంతో ప్రత్యేకంగా జరగబోతోంది.. ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. పెళ్లి జరిగే రోజే సంగీత్ కూడా ఏర్పాటు చేశాం. పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ.. సంతోషం, ప్రేమను పంచుకోబోతున్నాం. గౌతమ్ గొప్ప వ్యక్తి. అతడ్ని మా కుటుంబంలోకి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. తమ ప్రేమ కథను కాజల్ స్వయంగా ఈ ప్రపంచానికి తెలుపుతుంది’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం