ఎవరీ డీసీపీ వర్తిక చతుర్వేది?
షెఫాలి షా.. ఈమెను తెలుగు సినీ ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు. కానీ.. బాలీవుడ్లో మాత్రం అందరికీ సుపరిచితురాలు. విచిత్రం ఏంటంటే.. ఆమెను బాలీవుడ్కు పరిచయం చేసింది మరెవరో కాదు.. మన తెలుగు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. ఆయన దర్శకత్వంలో రెండు సినిమాల్లో నటించిందీ
బాలీవుడ్కు పరిచయం చేసిన రామ్గోపాల్ వర్మ
ఇంటర్నెట్ డెస్క్: డీసీపీ వర్తిక చతుర్వేది.. తాజాగా ఎమ్మీ పురస్కారం గెలుచుకున్న వెబ్ సిరీస్ ‘దిల్లీ క్రైమ్’లోని ఓ పాత్ర పేరిది. ఆ పాత్ర పోషించిన షెఫాలి షా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈమెను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా గుర్తుపట్టకపోవచ్చు కానీ.. బాలీవుడ్లో సుపరిచితురాలు. విచిత్రం ఏంటంటే.. ఆమెను బాలీవుడ్కు పరిచయం చేసింది దర్శకుడు రామ్గోపాల్ వర్మ. ఆయన దర్శకత్వంలో రెండు సినిమాల్లో నటించిందీ పవర్ఫుల్ లేడీ. 21 సంవత్సరాల వయస్సులో ఏ నటి అయినా సరే తల్లి పాత్ర చేసేందుకు సాహసం చేస్తారా..? కానీ.. షెఫాలీ చేసింది. తర్వాత తన కెరీర్ గురించి భయపడలేదు. ఇది చాలు కదా ఆమె తెగువ ఎలాంటిదో చెప్పడానికి..!
ముంబయికి చెందిన షెఫాలీ సినిమా రంగంలోకి రాకముందు గుజరాతి స్టేజ్ డ్రామాలో ఓ పాత్ర పోషించింది. కొంతకాలానికి ఆ నాటకాన్ని అందరూ మర్చిపోయారు. కానీ.. షెఫాలి నటన మాత్రం అందరి మనసుల్లోనూ ముద్రవేసింది. అక్కడి నుంచి ఆమె సినిమా రంగం వైపు అడుగులు పడ్డాయి. ఆ తర్వాత ఆమె దూరదర్శన్లో వచ్చే ‘ఆరోహణ్’ అనే ధారావాహికలో బుల్లితెరపై తొలిసారి కనిపించింది. 1995లో ‘రంగీలా’తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. నటన అంటే ప్రాణమిచ్చే షెఫాలి.. కథ నచ్చితే చాలు సినిమా, షార్ట్ఫిల్మ్, వెబ్ సిరీస్ అనే తేడా చూడదు. అందుకే అన్ని సినిమాల అనుభవాన్ని పక్కకునెట్టి మళ్లీ వెబ్ సిరీస్లో నటించేందుకు ఒప్పుకొంది.
అవార్డులు కొత్తేమీ కాదు...
పాతికేళ్ల తన సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది షెఫాలీ. 1995లో రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రంగీలా’లో నటించి అందర్నీ ఆకట్టుకుంది. అక్కడి నుంచి ఆమె బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.
⇒ 1998లో వర్మ దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం ‘సత్య’లో నటించింది. అందులో ఆమె నటనకు ఏకంగా రెండు అవార్డులు వచ్చాయి. ఆమె తన రెండో సినిమాతోనే ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకుంది. ఉత్తమ సహాయ నటి విభాగంలో స్టార్ స్క్రీన్ అవార్డు వచ్చిందామెకు.
⇒ 1999 నుంచి 2006 వరకు వరుసగా ఆరుసార్లు పలు అవార్డులకు నామినేట్ అయింది.
⇒ 2007లో ‘ది లాస్ట్ లీర్’లో వందనగా కనిపించింది. ఈ సినిమాలో ఆమె నటనకు ఉత్తమ సహాయనటి విభాగంలో నేషనల్ ఫిల్మ్ఫేర్ పురస్కారం వరించింది.
⇒ 2007లో ‘గాంధీ, మై ఫాదర్’లో ఆమె తన అభినయంతో ప్రేక్షకులను మరోసారి మెప్పించింది. ఈసారి ఉత్తమ నటి ‘టోక్యో ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు’ దక్కింది.
⇒ 2015లో ‘దిల్ ధడక్నే దో’ చిత్రం ఆమెకు మరో ఫిల్మ్ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది.
⇒ 2017లో ‘జ్యూస్’ సినిమాలో నటించింది. ఉత్తమ నటి విభాగంలో జియో ఫిల్మ్ఫేర్ షార్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది.
⇒ 2018లో ‘వన్స్ అగైన్’లో కనిపించి ఎడిటర్స్ ఛాయిస్-ఉత్తమ నటి విభాగంలో మరో అవార్డు సొంతం చేసుకుంది.
⇒ 2019లో ‘దిల్లీ క్రైమ్’ వెబ్ సిరీస్తో ఐరీల్ ఉత్తమ నటిగా నిలిచింది.
నవంబర్ 24 (సోమవారం)న 48వ ఎమ్మీ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. అందులో ఉత్తమ డ్రామాగా ‘దిల్లీ క్రైమ్’ ఎంపికైంది. వెబ్ సిరీస్ ఉత్తమ డ్రామా విభాగంలో అర్జెంటీనా, జర్మనీ, యూకేకు చెందిన వెబ్ సిరీస్లను వెనక్కి నెట్టి ఈ అవార్డు దక్కించుకోవడం విశేషం. దేశ రాజధాని దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం. రిషి మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షెఫాలి పవర్ఫుల్ డీసీపీగా కనిపించారు. ఒక పోలీస్గా నేరస్థులను పట్టుకోవాలనే కసి.. బాధితురాలికి న్యాయం చేయలనే తపనను ఆమె బాగా పండించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె డీసీపీ పాత్రలో జీవించారు. అయితే.. ‘దిల్లీ క్రైమ్’ ఎమ్మీ అవార్డు గెలుచుకోవడంపై షెఫాలి స్పందించారు. ‘ఓ మైగాడ్’ అంటూ పట్టరాని ఆనందం వ్యక్తం చేస్తూ అవార్డు ప్రకటిస్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ఈ వెబ్సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ప్రసారమైంది.
‘దిల్లీ క్రైమ్’ ఎమ్మీ అవార్డు సొంతం చేసుకోవడంతో.. ప్రముఖ కథానాయకుడు మహేశ్బాబు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘దిల్లీ క్రైమ్’ అద్భుతమైన సిరీస్ అని కొనియాడారు. ఎమ్మీ అవార్డును సొంతం చేసుకున్న ‘దిల్లీ క్రైమ్’ బృందానికి కంగ్రాట్స్. మీ కృషికి సరైన ఫలితం దక్కింది’ అని మహేశ్ ట్వీట్ చేశారు. ఆయనతోపాటు హృతిక్ రోషన్, తాప్సీ, సోనాలీ బింద్రే, విక్కీ కౌశల్, ఆదితిరావు హైదరీ, కరణ్ జోహార్ తదితరులు ‘దిల్లీ క్రైమ్’ టీమ్ను ప్రశంసిస్తూ ట్వీటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం