విమానాశ్రయం చూసి సర్ప్రైజ్ అయ్యా: మీనా
ఒకప్పటి అగ్ర కథానాయిక మీనా లాక్డౌన్ తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘దృశ్యం 2’ సినిమా షూటింగ్ కోసం చెన్నై నుంచి కేరళకు ప్రయాణం చేశారు. చాలా నెలల తర్వాత ఇలా పీపీఈతో (వ్యక్తిగత రక్షణ పరికరాలు) ప్రయాణించడం గురించి సోషల్మీడియా వేదికగా ఫాలోవర్స్తో మాట్లాడారు. తను సూట్ ధరించి ఉన్న ఫొటోల్ని షేర్ చేస్తూ..
చెన్నై: ఒకప్పటి అగ్ర కథానాయిక మీనా లాక్డౌన్ తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘దృశ్యం 2’ సినిమా షూటింగ్ కోసం చెన్నై నుంచి కేరళకు ప్రయాణం చేశారు. చాలా నెలల తర్వాత ఇలా పీపీఈతో (వ్యక్తిగత రక్షణ పరికరాలు) ప్రయాణించడం గురించి సోషల్మీడియా వేదికగా ఫాలోవర్స్తో మాట్లాడారు. తను సూట్ ధరించి ఉన్న ఫొటోల్ని షేర్ చేస్తూ.. ‘అంతరిక్షంలోకి వెళ్లడానికి సిద్ధమైనట్లు ఉన్నాను కదా.. నాకు యుద్ధానికి వెళ్తున్న భావన కలిగింది. దాదాపు ఏడు నెలల తర్వాత ప్రయాణం చేశా.. విమానాశ్రయం వెలవెలబోయి.. పరిసరాలు నిశ్శబ్దంగా ఉండటం చూసి సర్ప్రైజ్ అయ్యా. చాలా మంది ప్రజలు నాలా సూట్ ధరించకుండా రావడం చూసి ఆశ్చర్యపోయా. ఇది ఎంతో అసౌకర్యమైన డ్రెస్ అని కచ్చితంగా చెప్పగలను. చాలా ఉక్కపోతగా, చికాకుగా అనిపించింది. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ చెమటలు పట్టాయి. చేతికి గ్లౌజులు ధరించడం వల్ల కనీసం ముఖంపై చెమటను శుభ్రం చేసుకోలేని పరిస్థితి’.
‘రోజంతా ఇలాంటి సూట్లో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు హ్యాట్సాఫ్. ఇలాంటి అసౌకర్యవంతమైన దుస్తుల్లోనూ రోగుల బాధల్ని అర్థం చేసుకుని, సౌమ్యంగా వ్యవహరిస్తుండటం గొప్ప విషయం. వైద్యులపై నాకు ఇంకా గౌరవం పెరిగింది. మానవత్వంతో మీరు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు’ అని మీనా ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ‘దృశ్యం 2’ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2013లో వచ్చిన ‘దృశ్యం’కు సీక్వెల్ ఇది. మోహన్లాల్ కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్లో వెంకటేష్, మీనా జంటగా నటించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
Prathinidhi 2 Review: నారా రోహిత్ కీలక పాత్రలో నటించిన ‘ప్రతినిధి2’ ప్రేక్షకుల మెప్పించిందా? -
‘సికందర్’ సరసన రష్మిక
త్వరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది అందాల తార రష్మిక. -
రామోజీ ఫిల్మ్ సిటీలో.. కన్నప్ప సెట్లో
మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. -
అంధుడి పాత్రలో సైఫ్ అలీఖాన్?
పాత్ర బాగుంటే అది హీరోనా... విలనా అనేది చూడనంటారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. -
ప్రతినిధి 2 అలరిస్తుంది.. ఆలోచింపజేస్తుంది
‘‘ప్రస్తుత భారతదేశ రాజకీయాల్ని ప్రతిబింబించే చిత్రం ‘ప్రతినిధి 2’. ఇది ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీకో మేలు చేసేలా ఉండదు. -
మళ్లీ జాలీగా వచ్చేసింది పుష్ప
బాలీవుడ్లో నవ్వులు పూయించిన చిత్రాలు ఎన్నో. అందులో ‘జాలీ ఎల్ఎల్బీ’ ఫ్రాంచైజీ సినిమాలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు. -
మాయావన్లో పోరు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘మాయావన్’. -
మరో కొత్త కథతో నయన్ సిద్ధం!
గతేడాది ‘జవాన్’తో సినీప్రియుల్ని మెప్పించిన అగ్రకథానాయిక నయనతార.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. -
‘మాత్రు’.. ఓ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం
సుగి విజయ్, రూపాలి భూషణ్ జంటగా... జాన్ జక్కీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాత్రు’. -
భారతీయ పాటలకు లాస్ ఏంజెలిస్లో ఆస్కార్ గౌరవం
ఎన్నో ఏళ్లుగా కలగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ పురస్కారాన్ని అందుకొని.. భారతీయ సినిమా గొప్పతనాన్ని ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలబెట్టింది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం. -
మరోసారి వాయిదా
విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. -
భయ్యాజీ ప్రతీకారం
‘భయ్యాజీ’.. ఎంతో ప్రేమగా చూసుకునే తన తమ్ముడిని చంపిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ సోదరుడు చేస్తున్న పోరాటం ఆధారంగా రూపొందిన చిత్రమిది. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం