‘టక్ జగదీష్’ ఓటీటీలోనే?
ఒక వైపు కరోనా భయాలు... మరోవైపు ప్రదర్శన రంగంలో సమస్యలు... ఫలితంగా చిత్రసీమ ఉక్కిరిబిక్కిరవుతోంది. రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల్ని విడుదల చేసుకోలేని పరిస్థితి. ధైర్యం చేసి విడుదల చేసినా ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చాలడం లేదు.
ఒక వైపు కరోనా భయాలు... మరోవైపు ప్రదర్శన రంగంలో సమస్యలు... ఫలితంగా చిత్రసీమ ఉక్కిరిబిక్కిరవుతోంది. రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల్ని విడుదల చేసుకోలేని పరిస్థితి. ధైర్యం చేసి విడుదల చేసినా ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చాలడం లేదు. పైగా ఆంధ్రప్రదేశ్లో రాత్రి కర్ఫ్యూ, 50శాతం సామర్థ్యంతో ప్రదర్శనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాలకైతే ఓకే కానీ, భారీ వ్యయంతో రూపుదిద్దుకున్న చిత్రాలకి పెట్టుబడి తిరిగి రాని పరిస్థితి. గత వారం విడుదలైన సినిమాలు అంతంత మాత్రం ఫలితాల్ని రాబట్టాయి. చాలా చోట్ల థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. పెద్ద తెరపై తమ సినిమా చూపించాలని దర్శకనిర్మాతలకి, కథా నాయకులకు ఉన్నా... పరిస్థితులు ఏ రకంగానూ అనుకూలంగా లేవు. థియేటర్లలోనే విడుదల చేయాలని ఏడాదికిపైగా ఎదురు చూస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిపై పడుతున్న వడ్డీల భారం అంతా ఇంతా కాదు. భారం ఇన్నాళ్లూ మోస్తూ వచ్చినా... పరిస్థితులు అనుకూలంగా మారడం లేదు. దాంతో చాలామంది నిర్మాతలు భారం దించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓటీటీలో విడుదల చేయడంపై మొగ్గు చూపుతున్నారు. నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ ఓటీటీలోనే విడుదల కానుందని సమాచారం. ఆ మేరకు నిర్మాతలు, అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ మధ్య చర్చలు కూడా పూర్తయినట్టు తెలిసింది. రూ. 37 కోట్లకి డీల్ కుదిరినట్టు సమాచారం. త్వరలోనే చిత్రబృందం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. శాటిలైట్, హిందీ అనువాద హక్కులు కలుపుకొంటే రూ.50 కోట్లపైగానే ఈ సినిమా వ్యాపారం చేసినట్టవుతుందని లెక్కగడుతున్నాయి. రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ నాయికలుగా శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రమిది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.