Andaru Bagundali Andulo Nenundali: అందరూ బాగుండాలి..

అలీ, నరేష్‌ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మించారు.

Updated : 27 Oct 2022 08:50 IST

లీ (Ali), నరేష్‌ (Naresh) ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ (Andaru Bagundali Andulo Nenundali). అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 28న ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానుంది. ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్‌ను ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, బ్రహ్మానందం బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నటుడు, నిర్మాత అలీ మాట్లాడుతూ.. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మలయాళ చిత్రం ‘వికృతి’కి తెలుగు రీమేక్‌ ఇది. ఇందులో నేను.. నరేష్‌ పోటాపోటీగా నటించాం. 27ఏళ్ల తర్వాత మంజు భార్గవితో కలిసి మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. కిరణ్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘అలీ తొలిసారి నిర్మాతగా మారి చేస్తున్న చిత్రమిది. దీనికి నేను దర్శకుడు అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఎంతో మంది సీనియర్‌ ఆర్టిస్ట్‌లు ఉన్నా అందరూ నాకు మంచి సహకారం అందించారు. మురళీ మోహన్‌రెడ్డి కెమెరా వర్క్‌, రాకేశ్‌ పళిడమ్‌ సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ. మా ప్రయత్నాన్ని అందరూ ఆదరించి.. ఆశీర్వదించాలని కోరుతున్నా’’ అన్నారు చిత్ర దర్శకుడు. ఈ కార్యక్రమంలో కొణతాల మోహనన్‌ కుమార్‌, పృథ్వీ, శివ బాలాజీ, రాకేశ్‌, భద్రం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని