chaitu sam: నాగచైతన్య, సమంత.. వీరి ప్రేమకథ మాయ చేసింది!
‘‘ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుండగా నేను ఈ జెస్సీనే ఎందుకు ప్రేమించా’’ - ‘ఏ మాయ చేసావె’లో వినిపించిన తొలి డైలాగ్ ఇది. ఆ సినిమాలో
‘‘ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుండగా నేను ఈ జెస్సీనే ఎందుకు ప్రేమించా’’ - ‘ఏ మాయ చేసావె’లో వినిపించిన తొలి డైలాగ్ ఇది. ఆ సినిమాలో పదే పదే వినిపించే సంభాషణా అదే. అదే కార్తీక్... అదే జెస్సీని మళ్లీ ప్రేమించాడు.. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి, పెళ్లి కూడా చేసుకున్నారు. ‘ఏ మాయ చేసావె’లో కార్తీక్, జెస్సీల రీల్ స్టోరీ బాక్సాఫీసు దగ్గర హిట్టయితే.. నాగచైతన్య, సమంతల రియల్ లవ్ స్టోరీ తెలుగు సినీ అభిమానుల మనసుల్ని గెలుచుకొన్న సరికొత్త ప్రేమకథగా నిలిచింది. అనంతరం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వ్యక్తిగత కారణాలతో ఇరువురు విడిపోతున్నట్లు శనివారం ప్రకటించారు. మరి ‘ఏ మాయ చేసావె’ సందర్భంగా వీరి పరిచయం ఎలా ఏర్పడింది? వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పారు? ఓ సందర్భంలో చై-సామ్ జోడీ పంచుకున్న విశేషాలు..
హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెద్దల్ని ఒప్పించి ఒక్కటవ్వడం సినిమాల్లో చూస్తుంటాం. బాలీవుడ్లో అయితే వెండి తెర కథల్ని నిజం చేస్తూ, సినీ తారలు ఒక్కటవ్వడం మామూలే. కానీ, తెలుగు తెరకు మాత్రం అది అరుదైన అనుభూతి. ‘‘ఇంటికి తీసుకెళ్లి ఈ అమ్మాయినే పెళ్లి చేసుకొంటా అంటే.. ఏ అమ్మ అయినా ‘సరే’ అంటుంది’’ - ఇదీ.. ‘ఏమాయ చేసావె’లోని డైలాగే...అచ్చం అలానే సమంతని చైతూ ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేశాడు. ఇంట్లోవాళ్లూ ‘సరే..’ అన్నారు. ఈ కథలో విలన్లు లేరు, ప్రతికూల పరిస్థితులు లేవు. అనుకోని ట్విస్టులూ లేవు. అన్నీ హ్యాపీ మూమెంట్సే.
చైతూ, సమంతల లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది? ఎప్పుడు? అని అడిగితే.. ‘‘ఏమో.. నాక్కూడా తెలీదు. ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం, సాన్నిహిత్యం ముందు నుంచీ ఉన్నాయి. ఇద్దరం ఒకేసారి మా ప్రయాణాన్ని ప్రారంభించాం. హిట్లూ, ఫ్లాపులూ సరిసమానంగా ఎదుర్కొన్నాం. అప్పుడే ఒకరికి మరొకరం చేయూత ఇచ్చి పుచ్చుకొన్నాం. మా స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో చెప్పలేను... అంతా ఓ సినిమా కథలా అయిపోయింది’’ అని చెప్పేవారు చైతూ.
అయితే సమంత మాత్రం అప్పుడప్పుడూ కొన్ని క్లూలు ఇస్తూనే ఉండేది. చైతూకి సంబంధించి చేసే ట్వీట్లలో, చెప్పే మాటల్లో తన ప్రేమంతా బయటపెట్టేది. కానీ... ఎవ్వరూ అందిపుచ్చుకోలేకపోయారంతే. ‘‘ఏ మాయ చేసావె’ సందర్భంగా తొలిసారి చైతను కలిసినప్పుడు హాయ్ చెప్పానంతే! ఇక నా దృష్టంతా నాకు ఇచ్చిన డైలాగ్స్పైనే ఉండేది. చైతూ తోటి నటులకు చాలా గౌరవం ఇచ్చేవాడు. రెండో షెడ్యూల్లో ఒక సీన్ ఏడు నిమిషాలు ఉంటుంది. సింగిల్ టేక్లో చేయాలి. చైతన్య నా చేయి పట్టుకుంటే నేను డైలాగ్లన్నీ తెలుగులోనే చెప్పాలి. దాంతో చాలా భయం వేసేది. ఇంకో పక్క చైతూ నా చేయి గట్టిగా పట్టుకునేవాడు. చాలా ఒత్తిడిగా అనిపించేది. కానీ, చాలా సందర్భాల్లో చైతూ నాకు సహాయం చేశాడు. అప్పుడే మా స్నేహం మరింత బలపడి ప్రేమగా మారింది. నేను ముందు నుంచీ తన గురించి చెబుతూనే ఉన్నా. చాలా ఇంటర్వ్యూలలో చైతూని ప్రస్తావించా. తనని ప్రేమిస్తున్నా అని నేరుగా చెప్పలేదు గానీ, తనంటే ఇష్టమని చెప్పేదాన్ని. ఎవ్వరూ నా వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకోలేదు.. అందుకే మేం దొరకలేదు...’’ అనేది సమంత.
‘‘పరిశ్రమలో నా తొలి స్నేహితుడు చై. కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నప్పుడు తాను నన్ను చూసుకొన్న విధానం ఎప్పటికీ మర్చిపోను. అడుగడుగునా చేయూత అందించాడు. తన గురించి నాకు పూర్తిగా తెలుసు. నా గురించి తనకు తెలుసు. తన స్నేహితులు, అప్పటి లవ్ స్టోరీలూ... అన్నీ. అందుకే ఒకరి దగ్గర మరొకరికి దాపరికాలు లేవు’’ అంటూ తన ప్రేమ కథ గురించి చెప్పేది సమంత. చైతూదీ అదే మాట. ‘‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొన్నా అనిపిస్తుంది. ఇద్దరం జీవితానికి సంబంధించి కీలకమైన మలుపులో ఉన్నాం. తర్వాతేంటి? అని ఆలోచిస్తే ‘కలసి జీవితాన్ని కొనసాగించాలి’ అనే నిర్ణయమే సరైంది అనిపించింది. ఇంకేం ఆలోచించలేదు. ముందు తనంతట తానే బయటపడింది. ఆ తరవాత ఇద్దరం మా ఇంట్లోవాళ్లతో మాట్లాడాం...’’ అంటూ తమ ప్రేమకథ పెళ్లికి ఎలా దారితీసిందో చెప్పేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.