Devaki nandhana vasudev: ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు
అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర తొలి గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. ‘‘ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు’’ అంటూ సాగుతున్న ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా.. సురేశ్ గంగుల సాహిత్యాన్ని అందించారు. ఈశ్వర్ దత్తు ఆలపించారు. ‘‘ఆధ్యాత్మిక అంశాలతో నిండిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. దీంట్లో అశోక్ మాస్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్.
దేశాన్ని కాపాడాలంటే.. మన ధర్మాన్ని కాపాడుకోవాలి
‘‘మన దేశాన్ని కాపాడుకోవాలంటే మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇది ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యం’’ అంటున్నారు నటుడు రాకేశ్ వర్రె. ఇప్పుడాయన ప్రధాన పాత్రలో విరించి వర్మ తెరకెక్కించిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించారు. రియా సుమన్, వైశాలి రాజ్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 10న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇది 1980ల కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం. చిన్నప్పటి నుంచే సమాజం పట్ల అంకితభావం ఉన్న జితేందర్ రెడ్డి.. ఆ సమాజానికి ఏదో మంచి చెయ్యాలని తపన పడుతుంటాడు. ఈ క్రమంలోనే విద్యార్థి నాయకుడిగా ఎదిగి.. ఆ తర్వాత పోలీసు వ్యవస్థకు దీటుగా సమాజంలోని నక్సలైట్ల దౌర్జన్యాలకు ఎదురు వెళ్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఈ ప్రయాణంలో ఓవైపు రాజకీయ శక్తుల నుంచి.. మరోవైపు నక్సలైట్ల నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది చిత్ర కథాంశం. ‘‘నక్సలైట్లు దేశభక్తులు కాదు సర్. దేశం కోసం ప్రాణాలిచ్చే వాళ్లే నిజమైన దేశభక్తులు. ప్రాణాలు తీసే వాళ్లు కాదు సర్’’ అంటూ ట్రైలర్లో వినిపించిన డైలాగ్ ఆలోచింపజేసేలా ఉంది. ఈ సినిమాకి సంగీతం: గోపీ సుందర్, ఛాయాగ్రహణం: వి.ఎస్.జ్ఞానశేఖర్.
ఆలోచన రేకెత్తించే సత్య
హమరేశ్, ప్రార్థనా సందీప్ జంటగా వాలీ మోహన్దాస్ తెరకెక్కించిన చిత్రం ‘సత్య’. శివ మల్లాల నిర్మాత. ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘తన వల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని ఆలోచించే కొడుకు కథతో తెరకెక్కిన భావోద్వేగభరిత చిత్రమిది. సెన్సార్ పనులు పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికెట్ అందుకుంది’’ అన్నారు.
ఎగిరే ‘పతంగ్’
యువతరాన్ని అలరించే కథతో రూపొందిన ‘పతంగ్’ మరో ‘హ్యాపీడేస్’లా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు బుచ్చిబాబు సానా. ఆయనతోపాటు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ముఖ్య అతిథులుగా ఇటీవల ‘పతంగ్’ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. ప్రణీత్ ప్రతిపాటి దర్శకుడు. గాయకుడు, నటుడు ఎస్పీ చరణ్ ఓ కీలక పాత్రని పోషించారు. విజయ్ శేఖర్ అన్నే, సంపత్, సురేశ్ కొత్తింటి నిర్మిస్తున్నారు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాత. కామెడీ స్పోర్ట్స్ డ్రామాగా, పతంగుల పోటీ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. టీజర్ని విడుదల చేసిన అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ‘‘అంతెత్తున ఎగిరే పతంగ్లాగా, మా సినిమా అందరి దృష్టినీ ఆకర్షిస్తుంద’’న్నారు.
‘సర్పంచి’ ప్రారంభం
‘ప్రభుత్వ యంత్రాంగానికీ... ప్రజలకీ మధ్య వారధిగా ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించే సర్పంచి స్థానిక స్వయం పాలనలో ఎంత కీలకమో చాటి చెప్పే ప్రయత్నమే మా చిత్రం’ అన్నారు జట్టి రవికుమార్. ఆయన స్వయంగా దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘సర్పంచి’. ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. బోయినపల్లి హనుమంతరావు, పెండ్యాల సత్యనారాయణ, ఆంజనేయులు, బి.రమేశ్, అంజనీ, జట్టి రజిత, అక్షర జ్ఞాన తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘‘స్వపరిపాలన చేసే అద్భుతాల్ని మా సినిమాలో చూపిస్తున్నాం. ప్రేక్షకులకు స్వచ్ఛమైన వినోదంతోపాటు, వాళ్లలో చైతన్యం కలిగించేలా సినిమా ఉంటుంది. త్వరలోనే నటీనటులు, సాంకేతిక బృందం వివరాల్ని ప్రకటిస్తాం. భవిష్యత్తులోనూ మా జ్ఞాన ఆర్ట్స్ పతాకంపై ఇలాంటి చిత్రాలు వరుసగా నిర్మిస్తాం’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రసన్నవదనం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
సుహాస్ హీరోగా నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. -
శిఖర్ పహాడియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియాతో తన బంధం గురించి జాన్వీ మొదటిసారి స్పందించారు. -
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ భూ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై టీమ్ స్పందించింది. -
రివ్యూ: విద్య వాసుల అహం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ నటించిన చిత్రం ‘విద్య వాసుల అహం’. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
‘కన్నప్ప’లో స్టార్ హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన టీమ్
మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్ హీరోయిన్ భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ టీమ్ పోస్ట్ పెట్టింది. -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ల సినిమా టైటిల్ ఇదేనా!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే.. -
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
‘కృష్ణమ్మ’ సినిమా సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. -
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించి వస్తున్న కథనాలపై నిర్మాణ సంస్ధ క్లారిటీ ఇచ్చింది. -
వెనుదిరగక వెతుకు
‘ఇలాంటి పాత్రని పోషించడం నాకెరీర్లో ఇదే మొదటిసార’ని చెబుతున్నారు కాజల్ అగర్వాల్. ఆమె ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సత్యభామ’. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు. -
జోడీ.. తేలేదెప్పుడో?
కథానాయకులతో కథ సెట్టయ్యిందంటే చాలు ఆ తర్వాత కసరత్తులన్నీ ఆయనకు జోడీగా కనిపించే నాయిక చుట్టూనే తిరుగుతుంటాయి. సినీప్రియుల అభిరుచులకు తగ్గట్లుగా కొత్త భామతో ముందుకెళ్లాలా.. మార్కెట్ను ప్రభావితం చేసేలా హిట్టు జోడీని పునరావృతం చేయాలా.. -
‘గోట్’కి ‘అవతార్’ నిపుణుల వీఎఫ్ఎక్స్
అగ్ర కథానాయకుడు విజయ్ హీరోగా భారీ బడ్జెట్తో, అత్యంత భారీ అంచనాల మధ్య ముస్తాబవుతున్న చిత్రం ‘గోట్’. వెంకట్ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రానికి మరో ఆసక్తికర విషయం తోడైంది. -
ఎమర్జెన్సీ మరోసారి వాయిదా
బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. 1975ల నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. -
కవితా కృష్ణమూర్తికి లైఫ్టైమ్ అఛీవ్మెంట్ అవార్డు
శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, సీనియర్ నేపథ్య గాయని కవితా కృష్ణమూర్తి యూకే ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (యూకేఏఎఫ్ఎఫ్) జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. -
కేన్స్లో మన అందాలు
ఈ వేడుకలో నలుపు తెలుపు రంగుల కలబోతగా ఉన్న గౌను ధరించి ఆకట్టుకుంది ఐశ్వర్య. -
థియేటర్ల బంద్ వ్యక్తిగత నిర్ణయమే
‘తక్కువ వసూళ్లు వస్తున్నాయనే కారణంతో థియేటర్లు మూసివేయడం అనేది యాజమాన్యాలు ఎవరికి వారుగా వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. -
దివ్యవతి దెయ్యం ఎందుకైంది?
‘‘కథ బాగుంటే ప్రేక్షకులు సినిమాల్ని తప్పకుండా చూస్తారు. మా చిత్రంతో మళ్లీ థియేటర్లకి కళ వస్తుంది’’ అన్నారు ఆశిష్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లవ్ మీ’. ఇఫ్ యు డేర్ అనేది ఉపశీర్షిక. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య ఇప్పుడు ‘లవ్ మీ’తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో ఎదురైన ప్రశ్నలపై ఆమె స్పందించారు. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్ ..ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విజయవాడ డివిజన్ పరిధిలో 14 రైళ్లు రద్దు
-
గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. త్వరలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్!
-
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
-
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు