Dulquer Salmaan: ఆమె నన్ను అభ్యంతరకరంగా తాకింది.. ఎంతో ఇబ్బందిపడ్డా: దుల్కర్‌ సల్మాన్‌

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’, ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan). తాజాగా ఆయన తన పర్సనల్‌, వర్క్‌ లైఫ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 20 Aug 2023 01:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గతంలో ఓ అభిమాని ప్రవర్తన వల్ల తాను ఎంతో ఇబ్బందిపడ్డానని నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) తెలిపారు. స్టేజ్‌పై ఉన్నప్పుడు ఓ మహిళ తనని ఇబ్బందికరంగా పట్టుకుందని ఆయన చెప్పారు.

‘‘ఓకే కన్మని’, ‘సీతారామం’ తర్వాతే నాకు కేరళలో లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. సాధారణంగా నాకు బాయ్స్‌లో ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. నేను ఎప్పుడూ వాళ్లతో టచ్‌లో ఉంటా. అభిమానుల వల్ల ఇబ్బందిపడిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది మహిళలు ఫొటో తీసుకుంటానంటూ బుగ్గపై ముద్దు పెట్టాలని చూస్తుంటారు. వాళ్ల ప్రవర్తనతో ఆశ్చర్యపోయా. గతంలో ఒక పెద్దావిడ వల్ల నేను ఎంతో ఇబ్బంది పడ్డా. ఆమె నన్ను అభ్యంతరకరంగా తాకింది. నాకు ఎంతో బాధనిపించింది’’ అని ఆయన చెప్పారు.

Anasuya: కన్నీటి పర్యంతమైన అనసూయ.. ఆన్‌లైన్‌ నెగెటివిటీపై పోస్ట్‌

తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘28 ఏళ్ల వయసులోనే నాకు పెళ్లైంది. అమాల్‌ సోఫియా, నేనూ ఒకే స్కూల్‌లో చదువుకున్నాం. తనని కలిసినప్పుడే అర్థమైంది ఆమె నా జీవితం, కుటుంబంలో భాగమని. అంతకు ముందు ఏ అమ్మాయిని చూసినా నాకు ఆ భావన కలగలేదు. పెళ్లి, కెరీర్‌.. నాకు ఒకే సమయంలో మొదలయ్యాయి. పెళ్లైన కొద్దిరోజుల్లోనే రెండో సినిమా షూట్‌లో పాల్గొన్నా. షూట్స్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే నేను.. ఏ కాస్త సమయం దొరికినా తనతో గడపటానికి ఇష్టపడుతుంటా’’ అన్నారు.

అనంతరం ఆయన ఇటీవల ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ ఈవెంట్‌లో రానా వ్యాఖ్యలపై మాట్లాడారు. ‘‘అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు కాబట్టి నేను దానిపై మాట్లాడాలనుకోవడం లేదు. ఈ పరిశ్రమలో నాకు మంచి స్నేహితులు ఉన్నందుకు ఎంతో ఆనందిస్తున్నా. నేను దేనిపై ఫిర్యాదులు చేయను. నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతా. రానా.. ఆ విషయాన్ని చెప్పాలని అనుకుని ఉండరు. స్టేజ్‌పైకి వచ్చాక నా గురించి మాట్లాడుతూ చెప్పారనుకుంటా. అందుకే ఆయన క్షమాపణ కూడా చెప్పారు’’ అని తెలిపారు.

ఇదీ చదవండి: ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ రానా ఏం మాట్లాడారంటే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని