మళ్లీ వస్తా.. మల్లికనై పూస్తా!
హీరోలతో పోల్చితే నాయికల సినీ కెరీర్ పరిధి చాలా తక్కువ. అందుకే ఉన్న కొద్ది సమయంలోనే జెట్ స్పీడ్తో అన్ని భాషలు చుట్టొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అయితే పరభాషల్లో జోరు చూపించే క్రమంలోనో.. ఆచితూచి కథలు ఎంచుకునే ప్రయత్నాల్లోనో.. కొద్ది మంది నాయికలు అడపాదడపా తెలుగు చిత్రసీమ నుంచి గ్యాప్ తీసుకుంటుంటారు. అలాగని వాళ్లెప్పుడూ శాశ్వతంగా తెలుగు తెరకు దూరమవ్వాలనుకోరు. ఊరించే కథలు చేతికి చిక్కాయంటే చాలు.. మళ్లీ ఇక్కడ మెరుపులు మెరిపించే ప్రయత్నం
హీరోలతో పోల్చితే నాయికల సినీ కెరీర్ పరిధి చాలా తక్కువ. అందుకే ఉన్న కొద్ది సమయంలోనే జెట్ స్పీడ్తో అన్ని భాషలు చుట్టొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అయితే పరభాషల్లో జోరు చూపించే క్రమంలోనో.. ఆచితూచి కథలు ఎంచుకునే ప్రయత్నాల్లోనో.. కొద్ది మంది నాయికలు అడపాదడపా తెలుగు చిత్రసీమ నుంచి గ్యాప్ తీసుకుంటుంటారు. అలాగని వాళ్లెప్పుడూ శాశ్వతంగా తెలుగు తెరకు దూరమవ్వాలనుకోరు. ఊరించే కథలు చేతికి చిక్కాయంటే చాలు.. మళ్లీ ఇక్కడ మెరుపులు మెరిపించే ప్రయత్నం చేస్తుంటారు. అలా తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగి మాయమైన పలువురు అందాల భామలంతా.. ఇప్పుడు మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వాళ్ల చేతిలో ఉన్న సినిమాలు బాక్సాఫీస్ ముందు మెరిస్తే.. వాళ్లు మునుపటిలా మళ్లీ జోరు చూపించే అవకాశాలుంటాయి.
శ్రియ.. క్రేజీ క్రేజీగా..
తెలుగు తెరపై రెండు దశాబ్దాల సినీప్రయాణాన్ని పూర్తి చేసుకున్న కొద్ది మంది కథానాయికల్లో నటి శ్రియ ఒకరు. ఒకప్పుడు ఏడాదికి నాలుగైదు చిత్రాలతో తీరిక లేకుండా గడిపిన ఈ అమ్మడు.. పెళ్లి తర్వాత నుంచి కాస్త వేగం తగ్గించింది. అయినా అడపాదడపా ఏదోక మంచి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తూనే ఉంటోంది. ‘ఎన్టీఆర్ బయోపిక్’ తర్వాత రెండేళ్ల పాటు వెండితెరకు దూరమైన ఈ అందాల భామ.. మళ్లీ క్రేజీ ఆఫర్లతో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘గమనం’ అనే నాయికా ప్రాధాన్య సినిమా చేస్తోంది. సుజనా రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. దీంట్లో శ్రియ బధిర మహిళగా ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. ఇక ఆమె ‘ఆర్ఆర్ఆర్’లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి
తెలిసిందే.
నిత్యామేనన్ జోరు..
కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరించే నాయికల్లో అందరి కంటే ముందుంటుంది నటి నిత్యా మేనన్. అందుకే తెలుగు తెరపై అడుగుపెట్టి పదకొండేళ్లు పూర్తవుతున్నా.. పాతిక చిత్రాలూ చేయలేకపోయింది. ఆమె నుంచి ఇటీవల వచ్చిన తెలుగు సినిమాలంటే.. ‘గీత గోవిందం’, ‘ఎన్టీఆర్ బయోపిక్’ మాత్రమే. అవి వచ్చీ రెండేళ్లు కావొస్తున్నాయి. అయితే ఇప్పుడీ అమ్మడి పేరు తెలుగులో పలు క్రేజీ ప్రాజెక్ట్లలో వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్, రానా కథానాయకులుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్కు జోడీగా నిత్యామేనన్ నటించనున్నట్లు సమాచారం అందుతోంది. తెలుగులో స్కైల్యాబ్ కథాంశంతో తెరకెక్కుతోన్న కొత్త చిత్రంలోనూ.. ‘గమనం’లోనూ ముఖ్య పాత్రలు పోషిస్తోంది.
అందాల అదా.. ఆజా
‘హార్ట్ఎటాక్’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘క్షణం’ లాంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముంబయి అందం అదా శర్మ. అటు ఉత్తరాదిలో ఇటు దక్షిణాదిలో వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్న ఈ అమ్మడు.. తెలుగు తెరపై మెరుస్తున్నది తక్కువే. ఆమె చివరగా తెలుగులో ‘కల్కి’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇప్పుడీ భామ ‘క్వశ్చన్ మార్క్’ (?) సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
అనుపమ అల్లరి..
మలయాళ సినిమా ‘ప్రేమమ్’తో వెండితెరకు పరిచయమై.. ‘అఆ’తో తెలుగు వారి ముందుకొచ్చిన భామ అనుపమ పరమేశ్వరన్. ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒకటే జిందగి’, ‘రాక్షసుడు’ లాంటి చిత్రాలతో మంచి నాయికగా ఎదిగింది. రెండేళ్లుగా మలయాళ సీమకే పరిమితమైంది. ఇప్పుడు తెలుగులో మళ్లీ వరుస సినిమాలతో జోరు చూపించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఆమె ‘18 పేజీస్’ చిత్రంతో పాటు దిల్రాజు బ్యానర్లో ఓ కొత్త సినిమా చేస్తోంది.
‘మజిలీ’ భామ.. కొత్త అవకాశాలు
నాగచైతన్య హీరోగా నటించిన ‘మజిలీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది అందం దివ్యాంశ కౌశిక్. ఆ చిత్రం తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు. ‘ది వైఫ్’ అనే వెబ్సిరీస్తో బాలీవుడ్లోనూ, ‘టక్కర్’ చిత్రంతో తమిళంలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ రెండూ ఆమెకి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ భామ మళ్లీ తెలుగు వైపు దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె నాగశౌర్య ‘పోలీసు వారి హెచ్చరిక’ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందని సమాచారం. రవితేజ - దర్శకుడు శరత్ మండవ కలయికలో రూపొందనున్న కొత్త చిత్రంలోనూ ఆమె నాయికగా కనిపించే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం