రాక్షస కావ్యమిది

నవీన్‌ బేతిగంటి, అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేష్‌, దయానంద్‌ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్‌ కీర్తి దర్శకుడు.

Published : 16 Nov 2021 04:07 IST

వీన్‌ బేతిగంటి, అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేష్‌, దయానంద్‌ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్‌ కీర్తి దర్శకుడు. దాము రెడ్డి, ఉమేష్‌ చిక్కు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రచార చిత్రం.. విష్ణు సహస్రనామ స్తోత్రంతో ఆసక్తికరంగా సాగింది. ‘‘ఒక్క మాట యాది ఉంచుకో బిడ్డ.. మనసంటోళ్లు పది మంది చచ్చిపోయినా ఎవ్వరికి ఫరక్‌ పడదు. కానీ, ఒక్కడు సదువుకుంటే మనసంటోళ్లను వందమందిని బతికిస్తడు’’ అంటూ ఆ వీడియోలో వినిపించిన డైలాగ్‌ ఆకట్టుకుంది. 90వ దశకం నేపథ్యంలో సాగే సోషల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: రాజీవ్‌ రాజ్‌, శ్రీకాంత్‌, ఛాయాగ్రహణం: రుషి కోనాపురం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని