Gandharva: వినూత్నమైన కథాంశంతో.. ‘గంధర్వ’

సందీప్‌ మాధవ్‌, గాయత్రి ఆర్‌.సురేష్‌ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’. అఫ్సర్‌ దర్శకుడు. ఫన్నీ ఫాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్‌.కె.ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 02 Jul 2022 07:12 IST

సందీప్‌ మాధవ్‌(Sandeep Madhav), గాయత్రి ఆర్‌.సురేష్‌ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’ (Gandharva). అఫ్సర్‌ దర్శకుడు. ఫన్నీ ఫాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్‌.కె.ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సందీప్‌ మాట్లాడుతూ.. ‘‘టైటిల్‌లోనే కొత్తదనం ఉంది. ఫ్యామిలీ డ్రామా, సైన్స్‌ ఫిక్షన్‌, కామెడీ, యాక్షన్‌, థ్రిల్లింగ్‌ అంశాలను మేళవించి అందరికీ నచ్చేలా చిత్రం రూపొందించాం. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది’’ అన్నారు. ‘‘ఓ వినూత్నమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. గంధర్వ పాత్రలో సందీప్‌ చక్కగా ఒదిగిపోయారు. జులై 8న సినిమా చూసి ఆనందించండి’’ అన్నారు దర్శకుడు. నిర్మాత సురేష్‌ కొండేటి మాట్లాడుతూ.. ‘‘భారతీయ సినిమాలో ఇప్పటివరకు రాని పాయింట్‌తో ఈ చిత్రం రూపొందింది. ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’లాగే ఈ కథనూ నమ్మి తీసుకున్నా. మా ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని