The Ghost: ‘ది ఘోస్ట్’.. మనసుల్ని గెలుచుకుంటుంది
‘‘యాక్షన్.. ఎమోషన్ రెండూ సమపాళ్లలో ఉన్న చిత్రం ‘ది ఘోస్ట్’. ఇది బాగుందని ప్రేక్షకులు చెబితే తప్పకుండా కొనసాగింపు చిత్రాల్ని తీస్తాం’’ అన్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా...
‘‘యాక్షన్.. ఎమోషన్ రెండూ సమపాళ్లలో ఉన్న చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost). ఇది బాగుందని ప్రేక్షకులు చెబితే తప్పకుండా కొనసాగింపు చిత్రాల్ని తీస్తాం’’ అన్నారు నాగార్జున (Nagarjuna). ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. సోనాల్ చౌహాన్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 5నప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్లో రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం ఓ సెంటిమెంట్తో ప్రారంభమైంది. నాతో సినిమా తీయాలనేది దివంగత నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ కోరిక. అలా ఆయన తనయుడు సునీల్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. నాలాగే ఈ సినిమాకి పనిచేసిన వారంతా చాలా యంగ్ (నవ్వుతూ). కసి, ప్రేమతో ఈ చిత్రాన్ని తీశాం. ఇందులో చాలా బలమైన కథ ఉంది. యాక్షన్తో పాటు ఎమోషన్కూ చాలా ప్రాధాన్యముంది. ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలంటే కంటెంట్తో పాటు సాంకేతికంగా ఉన్నతంగా ఉండాలి. ఈ రెండింటితో ఈ చిత్రాన్ని నింపేశారు దర్శకుడు ప్రవీణ్. సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాం. ఇటీవల ప్రీరిలీజ్ వేడుకలో మాకు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవికి థ్యాంక్స్. ఆయన చెప్పినట్లు అన్ని సినిమాలు మంచి విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో నాగార్జున ఓ యాక్షన్ విజువల్ ఫీస్ట్ను ఇవ్వబోతున్నారు. సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. విజయదశమి రోజున మా ‘ఘోస్ట్’ వస్తోంది. మీ అందరి మనసుల్ని గెలుచుకుంటుంది’’ అన్నారు చిత్ర దర్శకుడు ప్రవీణ్. నటి సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ.. ‘‘ఇది నాకెంతో ప్రత్యేకమైన సినిమా. ఈ చిత్రంతో నాగార్జునతో కలిసి తొలిసారి యాక్షన్ చేసే అవకాశమొచ్చింది’’ అంది. ఈ కార్యక్రమంలో జాన్వీ, సునీల్ నారంగ్, అదిత్ మరార్, విక్రమాదిత్య తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ ప్రచారం వినిపిస్తోంది!
తాను ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు నాగార్జున. ఆయన త్వరలో విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ‘ది ఘోస్ట్’ ప్రెస్మీట్లో స్పందించారు. ‘‘గత పదేళ్లుగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ నేను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని ప్రచారం జరుగుతోంది. అదెప్పుడూ నిజం కాలేదు. ఇప్పుడీ ప్రచారంలోనూ నిజం లేదు. నేను ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయట్లేదు. మంచి కథ దొరికితే మాత్రం రాజకీయ నాయకుడిగా నటిస్తా’’ అన్నారు నాగ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు