NTR: ఎన్టీఆర్‌ గళంతో...

సాయితేజ్‌ కథానాయకుడిగా... కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సంయుక్త మేనన్‌ కథానాయిక. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

Updated : 05 Dec 2022 06:58 IST

సాయితేజ్‌ (Saidharam Tej) కథానాయకుడిగా... కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సంయుక్త మేనన్‌ (Samyuktha Menon) కథానాయిక. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అందించిన కథతో రూపొందుతున్న ఈ సినిమాకి ఇంకా పేరు ఖరారు చేయలేదు. పేరుతో కూడిన ప్రచార చిత్రాన్ని ఈనెల 7న విడుదల చేయనున్నారు. ఆ ప్రచార చిత్రానికి అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ (NTR) వాయిస్‌ ఓవర్‌ అందించారు. మిస్టిక్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఓ గ్రామం నేపథ్యంలో సాగుతుందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని