కల్యాణ్రామ్కు అమిగోస్ ఓ మైలురాయి: ఎన్టీఆర్
‘‘మా కుటుంబంలో ఎంతమంది నటీనటులున్నా.. అందరి కంటే ఎక్కువ ప్రయోగాత్మక చిత్రాలు చేసింది అన్నయ్య కల్యాణ్రామే’’ అన్నారు కథానాయకుడు ఎన్టీఆర్.
‘‘మా కుటుంబంలో ఎంతమంది నటీనటులున్నా.. అందరి కంటే ఎక్కువ ప్రయోగాత్మక చిత్రాలు చేసింది అన్నయ్య కల్యాణ్రామే’’ అన్నారు కథానాయకుడు ఎన్టీఆర్. ఆయన ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘అమిగోస్’ విడుదల ముందస్తు వేడుకలో ఈ వ్యాఖ్యలు చేశారు. కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రమిది. రాజేంద్ర రెడ్డి తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఆషికా రంగనాథన్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘నేను ‘జైలవకుశ’లో త్రిపాత్రాభినయం చేశా. అదెంత కష్టమో నాకు తెలుసు. అన్నయ్య ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. తప్పకుండా తన కెరీర్లో ఈ ‘అమిగోస్’ మైలురాయిలా నిలుస్తుంది. దర్శకుడు రాజేంద్ర ఇంజినీరింగ్ చేశారు. వాళ్ల అమ్మానాన్న ఉద్యోగం చేసుకోవచ్చు కదరా అంటే.. నేను ఓ సినిమా తెరకెక్కించాకే తిరిగి ఇంటికొస్తానని చెప్పారు. కానీ, సినిమా మొదలయ్యే లోపు వాళ్లమ్మ, పూర్తయ్యే లోపు తండ్రి కాలం చేశారు. సినిమా పట్ల ఓ మనిషికి ఇంత తాపత్రయం ఉంటుందా అనేది రాజేంద్రను చూశాకే తెలిసింది. మైత్రీ మూవీస్ అంటే నా కుటుంబమే. వాళ్ల నుంచి వస్తున్న ‘అమిగోస్’ విజయం సాధించాలని కోరుకుంటున్నా. అప్డేట్లు కావాలని దర్శకనిర్మాతలపై ఒత్తిడి పెంచకండి. ఇది మా విన్నపం మాత్రమే. నిజంగా ఏదైనా అదిరిపోయే అప్డేట్ ఉంటే మా భార్యల కన్నా ముందు మీతోనే పంచుకుంటాం. నా తదుపరి చిత్రం ఈనెలలోనే ప్రారంభిస్తాను. మార్చి 20 లేదా ఈలోపే రెగ్యులర్ చిత్రీకరణ మొదలు పెడతాం. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తాం’’ అన్నారు.
హీరో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘తొలిసారి మనుషుల్ని పోలిన మనుషుల కథతో ఈ వినూత్నమైన థ్రిల్లర్ చిత్రం చేశాం. నాకిలాంటి కథ ఇచ్చినందుకు రాజేంద్రకు కృతజ్ఞతలు. ఎందుకంటే ‘బింబిసార’ తర్వాత ఎలాంటి చిత్రం చేయాలనుకున్నప్పుడు ఈ కథ తెచ్చారు. కచ్చితంగా ఈ సినిమా ఎవరినీ నిరుత్సాహపరచదు. ఇందులో ఆషికా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. మా చిత్ర బృందమంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేసింది. అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నాకింత పెద్ద అవకాశం ఇచ్చినందుకు మైత్రీ మూవీస్కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నన్ను.. నా కథను నమ్మి ఈ అవకాశమిచ్చిన కల్యాణ్రామ్కు కృతజ్ఞతలు. సౌందర్ రాజన్ లేకుంటే సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. జిబ్రాన్ అద్భుతమైన సంగీతమందించారు. ఈ చిత్రం అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది. కల్యాణ్రామ్ నటనను మరోస్థాయిలో చూస్తారు’’ అన్నారు దర్శకుడు రాజేంద్ర రెడ్డి. నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ మాట్లాడుతూ.. ‘‘కల్యాణ్రామ్తో ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకున్నాం. అదిప్పటికి నెరవేరింది. సినిమా చూశాం. చాలా బాగా వచ్చింది. ‘బింబిసార’ తర్వాత ఆస్థాయిలో ఉంటుంది. కథ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇది కచ్చితంగా మాకు హ్యాట్రిక్ హిట్గా నిలుస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు. ఈ వేడుకలో ఆషికా రంగనాథ్, వశిష్ఠ, బుచ్చిబాబు, రామజోగయ్యశాస్త్రి, బ్రహ్మాజీ, అవినాష్ కొల్లా, భరత్ కమ్మ, ప్రణవి, శుభ శ్రీ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?