సంక్షిప్త వార్తలు (5)
నటుడు నరేష్ చిత్రసీమకు పరిచయమై 50ఏళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆయన ‘మళ్లీ పెళ్లి’ పేరుతో తన గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ప్రకటించారు.
నరేష్.. ‘మళ్లీ పెళ్లి’
నటుడు నరేష్ చిత్రసీమకు పరిచయమై 50ఏళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆయన ‘మళ్లీ పెళ్లి’ పేరుతో తన గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈ మేరకు ఆ చిత్ర ఫస్ట్లుక్ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో పవిత్ర లోకేష్ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా.. నరేష్ ఆమెను తదేకంగా చూస్తూ కనిపించారు. ఈ సినిమాలో ఈ ఇద్దరూ జంటగా కనిపిస్తున్నట్లు ఈ ప్రచార చిత్రాన్ని బట్టి అర్థమవుతోంది. ఈ సినిమాతో నరేష్ తన విజయ కృష్ణ మూవీస్ను పునఃప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాని ఎం.ఎస్.రాజు తెరకెక్కిస్తున్నారు. వనిత విజయకుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంగీతం: సురేష్ బొబ్బిలి, ఛాయాగ్రహణం: ఎం.ఎన్.బాల్ రెడ్డి.
వినోదాల ‘యమ డ్రామ’
యువ చంద్ర, శివకుమార్, కౌటిల్య, సుదర్శన్ రెడ్డి, ప్రియాంక శర్మ, నేహాదేశ్ పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యమ డ్రామ’. టి.హర్ష చౌదరి తెరకెక్కించారు. తోటకూర శివరామకృష్ణారావు నిర్మించారు. సాయికుమార్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర టైటిల్ లోగోను నటి విజయశాంతి శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేటి ట్రెండ్ను దృష్టిలో పెట్టుకొని యూత్ఫుల్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందించినట్లు దర్శక నిర్మాతలు చెప్పారు. తప్పకుండా ఈ సినిమా అందరినీ ఆలరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘మంచి వినోదాత్మక చిత్రమిది. అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. ఈ సినిమాతో యువతరానికి ఓ మంచి సందేశం ఇవ్వనున్నాం. సాయికుమార్ పోషించిన యముడి పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు దర్శకుడు టి.హర్ష. నిర్మాత శివరామకృష్ణారావు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని ఏప్రిల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
నిజంగా చట్టమంటే?
మధుబాల, పూజ, స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్, రోహిణి ప్రధాన పాత్రల్లో బాబు నిమ్మగడ్డ తెరకెక్కించిన చిత్రం ‘సత్యం వధ ధర్మం చెర’. ఎదుబాటి కొండయ్య నిర్మాత. ఈ సినిమా ఈనెల 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో శుక్రవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబు నిమ్మగడ్డ మాట్లాడుతూ.. ‘‘సమాజంలో జరిగిన కొన్ని నిజ సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఈ చిత్రం తెరకెక్కించాం. మన రాజ్యాంగం గొప్పది. చట్టం చాలా గట్టిది. కానీ, బాధితుడు చిన్నవాడు.. కారకుడు పెద్దవాడైనప్పుడు ఈ చట్టం రకరకాలుగా పని చేస్తుంది. మరి నిజంగా చట్టం ఎలా పని చేయాలన్నది ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు.
గాయని బాంబే జయశ్రీకి అస్వస్థత
ప్రముఖ గాయని బాంబే జయశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు వెల్లడించారు. ‘‘కచేరీల కోసం ప్రస్తుతం జయశ్రీ యూకేలో ఉన్నారు. శుక్రవారం అక్కడే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. సమయానికి వైద్యం అందడంతో ఆమె ఆరోగ్యం నిలకడ స్థితికి చేరుకుంది. అక్కడి ఆసుపత్రి వర్గాలతో పాటు ఆమె సన్నిహితులు సత్వర స్పందనే దీనికి కారణం’’అని జయశ్రీ సన్నిహితులు తెలియజేశారు. జయశ్రీ ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తల్ని నమ్మొద్దని కూడా వాళ్లు కోరారు. ‘‘ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దు. దయచేసి మాకు ప్రైవసీ ఇవ్వండి’’అని చెప్పారు. మెదడుకు సంబంధించిన రక్తనాళాల్లో వాపు రావడంతో జయశ్రీ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం.. ఇలా పలు భాషల్లో గొప్ప పాటలెన్నో పాడారు జయశ్రీ.
‘పరిణీత’ దర్శకుడు కన్నుమూత
బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్(67) ఇక లేరు. ‘పరిణీత’ చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన ‘మర్దానీ’, ‘హెలికాప్టర్ ఈలా’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. దర్శకుడు కాకముందు ప్రకటన చిత్రాలతో పాటు పలు వీడియో గీతాల్ని రూపొందించి పేరు తెచ్చుకున్నారు. తొలి చిత్రం ‘పరిణీత’కుగానూ జాతీయ పురస్కారం అందుకున్నారు ప్రదీప్. సినిమాలే కాకుండా పలు వెబ్సిరీస్లకు కూడా దర్శకత్వం వహించారు. ప్రదీప్ మృతిపట్ల అజయ్దేవ్గణ్, మనోజ్ బాజ్పాయ్, హన్సల్ మెహతా, కంగనా రనౌత్, రాణీ ముఖర్జీ తదితర సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం