Janhvi kapoor: చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?

‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన  గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్‌’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్‌.

Updated : 18 Apr 2024 11:53 IST

‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన  గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్‌’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్‌. ఆమె, గుల్షన్‌ దేవయ్య, రోషన్‌ మాథ్యూ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రమే ‘ఉలఝ్‌’. సుధాంశు సరియా దర్శకుడు. ఇందులో ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి సుహానాగా జాన్వీ కనిపించనుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుందీమె. ‘నువ్వు చేసినదంతా దేశం కోసమేనని నిజంగా నమ్ముతున్నావా’ అంటూ సుహానా పాత్రను పరిచయం చేస్తూ మొదలైన టీజర్‌ ఆసక్తిగా సాగింది. ‘నమ్మకద్రోహం, విధేయత అనేవి మనలాంటి వారిని ట్రాప్‌ చేసేందుకు రూపుదిద్దుకున్న మాటలు మాత్రమే’ లాంటి సంభాషణలు అందర్నీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ‘నమ్మకద్రోహం ఖరీదు ఒక ప్రాణం. నీదే అర్పిస్తావా? లేక వేరొకరిని బలిగొంటావా?’ అంటూ చివర్లో జాన్వీ చెప్పిన డైలాగు టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం జులై 5న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని