Kiran Abbavaram: కానిస్టేబుల్ ‘సెబాస్టియన్’ రేచీకటి కష్టాలు
కిరణ్ అబ్బవరం హీరోగా బాలాజీ సయ్యపురెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సెబాస్టియన్’. పిసి 524.. అన్నది ఉపశీర్షిక. ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. నమ్రతా దారేకర్, కోమలి ప్రసాద్ కథానాయికలు. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం
కిరణ్ అబ్బవరం హీరోగా బాలాజీ సయ్యపురెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సెబాస్టియన్’. పిసి 524.. అన్నది ఉపశీర్షిక. ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. నమ్రతా దారేకర్, కోమలి ప్రసాద్ కథానాయికలు. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కిరణ్ మాట్లాడుతూ ‘‘ఎస్.ఆర్. కల్యాణమండపం’ షూట్లో ఉన్నప్పుడు బాలాజీ నన్ను కలిశారు. ‘సెబాస్టియన్’ కథ.. పాత్ర ఎలా ఉంటుందన్నది క్లుప్తంగా చెప్పారు. 15నిమిషాలు కథ వినగానే సినిమా చేయడానికి ఒప్పుకున్నా. నేనిందులో రేచీకటితో బాధపడే కానిస్టేబుల్గా కనిపిస్తా. ‘చంటి’లో బ్రహ్మానందం గారు 15నిమిషాలు రేచీకటి పాత్ర చేస్తేనే అందరూ ఎంతో ఎంజాయ్ చేశారు. అందుకే ఈ పాత్రను ఓ సవాల్లా తీసుకుని చేశా. సెబా పాత్ర నా కెరీర్లో ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ఈ కథ మన పక్కింటి కుర్రాడి కథలా ఉంటుంది. సినిమా ప్రేక్షకుల్ని వందశాతం ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘సెబాస్టియన్ అనే కానిస్టేబుల్ తనకున్న రేచీకటి సమస్య వల్ల ఎలాంటి ఇబ్బందులెదుర్కొన్నాడు? అన్నది ఈ చిత్ర కథాంశం. మదనపల్లె రూరల్ బ్యాక్ డ్రాప్లో సాగుతుంది. 32రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం’’ అన్నారు దర్శకుడు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఈనెల 25న మా సెబాస్టియన్ ఛార్జ్ తీసుకోనున్నాడు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దారెడ్డి, విప్లవ్, రాజ్ కె.నల్లి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింపజేస్తాం
‘బాహుబలి’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేటెడ్ సిరీస్ ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’. దీనికి జీవన్ జె.కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. -
ఊరిస్తున్న ఎన్టీఆర్
‘దేవర’ ప్రచార చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించారు ఎన్టీఆర్. ‘వార్ 2’ కోసం హిందీలోకి అడుగుపెట్టి.... ఆ కొత్త ప్రయాణం గురించీ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేశారు. ఆయన పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో మరోసారి ‘దేవర’ ప్రచార చిత్రాలు కానీ, పాటతో కానీ హంగామా చేయొచ్చని పరిశ్రమ, అభిమాన వర్గాల అంచనా. -
తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ మలుపు... ఆర్య
‘‘తెలుగు సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించేలా అప్పట్లో ‘ఆర్య’ తీశారు సుకుమార్. ఎంతో మంది దర్శకులు... ఎన్నో మంచి చిత్రాలు ఈ సినిమా నుంచే వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు’’ అన్నారు అల్లు అర్జున్. -
మెరుపుల తార.. తళుకుల చీర
అందం, నటనతో అలరిస్తున్న బాలీవుడ్ అగ్రనాయిక అలియా భట్ ఈసారి ఆకట్టుకునే వస్త్రధారణతో అంతర్జాతీయ యవనికపై అలరించింది. ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక ‘మెట్ గలా’లో ఆమె చీరలో మెరిసింది. -
రోడ్లన్నీ గతుకులపాలే.. ఊరంతా చీకటిపాలే
ఓట్లు కొనేసి ఆ తర్వాత ప్రజల బాగుని మరిచే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని... గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిస్తూ ‘కమిటీ కుర్రోళ్ళు’ పాటందుకున్నారు. మరి వారి ఆట పాట జనాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘డియర్ స్టూడెంట్స్’ సందడి మొదలు
ఇటీవలే ‘డియర్ స్టూడెంట్స్’ అగ్రతార నయనతారకు స్వాగతం పలికారు. ఈమె, నివిన్ పౌలీ జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రమిది. సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్రాయ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. -
జులై 20న... కౌలాలంపూర్లో
తెలుగు సినిమా వైభవాన్ని... వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుకని నిర్వహిస్తామని చెప్పారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. జులై 20న కౌలాలంపూర్, బుకిట్ జలీల్లోని ప్రతిష్ఠాత్మక నేషనల్ స్టేడియంలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
తెరపై యుద్ధం.. ఖర్చు రూ.8కోట్లు
‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఇప్పుడు ‘స్వయంభూ’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తామని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు.