virataParvam: ‘నగాదారి’లో అంటూ వచ్చేసిన రానా,సాయిపల్లవి..

రానా, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈ సినిమా జూన్‌17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 02 Jun 2022 15:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానా, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈ సినిమా జూన్‌17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1990ల్లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.  నక్సలిజం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలోని ‘నగాదారిలో’ అనే పాటను చిత్రబృందం నేడు విడుదల చేసింది. ‘నిప్పు ఉంది.. నీరు ఉంది..’ అంటూ సాగే లిరిక్స్‌ అందర్ని ఆకట్టుకొన్నాయి. కామ్రేడ్‌ రవన్న పాత్రలో రానా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆయన ప్రేయసి వెన్నెలగా సాయిపల్లవి నటిస్తోంది. ప్రియమణి, నందితా దాస్‌,నవీన్‌ చంద్ర, జరీనా వహాబ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సురేశ్‌ బొబ్బిలి స్వరాలందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని