Nagarjuna: కొత్త కథలతో కసరత్తులు
నూతన సంవత్సరం ఆరంభమయ్యేలోపు కొత్త సినిమా కథపై నిర్ణయం తీసుకుంటానని ‘ది ఘోస్ట్’ సమయంలోనే చెప్పారు కథానాయకుడు నాగార్జున.
నూతన సంవత్సరం ఆరంభమయ్యేలోపు కొత్త సినిమా కథపై నిర్ణయం తీసుకుంటానని ‘ది ఘోస్ట్’ (The Ghost) సమయంలోనే చెప్పారు కథానాయకుడు నాగార్జున (Nagarjuna). ఈసారి తొందరేమీ లేకుండా... కొంచెం విరామం తీసుకుని ఆ తర్వాతే సినిమాని పట్టాలెక్కిస్తామని అప్పట్లో చెప్పారు. అన్నట్టుగానే కొన్ని నెలలుగా ఆయన కథలపైనే దృష్టిపెడుతూ వస్తున్నారు. సీనియర్ దర్శకులతోపాటు, కొత్తతరం నుంచీ ఆయన కథలు విన్నట్టు తెలిసింది. ‘గాడ్ఫాదర్’ ఫేమ్ మోహన్రాజాతోపాటు (Mohan Raja), మరో రచయిత చెప్పిన కథకి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మరో దర్శకుడు విక్రమ్ కె.కుమార్ (Vikram K Kumar) పేరు కూడా వినిపించింది. వీళ్లు చెప్పిన ఏదో ఒక కథతో వచ్చే ఏడాదిలో సినిమా షురూ అయ్యే అవకాశాలున్నాయనేది పరిశ్రమ వర్గాలు చెబుతున్న మాట. 2022ని ‘బంగార్రాజు’తో మొదలుపెట్టిన ఆయన ‘ది ఘోస్ట్’, ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాలతో సందడి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: నేను కూడా జంక్ఫుడ్ తిన్నా.. కానీ: విరాట్ కోహ్లీ
-
India News
Nirmala Sitharaman: బడ్జెట్ వేళ..ప్రత్యేక ఆకర్షణగా నిర్మలమ్మ చీరకట్టు..!
-
Politics News
Kotamreddy: అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే?: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Movies News
Varun Tej: మెగా నివాసంలో పెళ్లి బాజాలు.. వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు స్పష్టత
-
Ap-top-news News
Andhra News: బాలిక కడుపు నుంచి కిలోకు పైగా జుత్తు తొలగింపు
-
Movies News
Asha Saini: ఆ నిర్మాత నన్ను హింసించాడు.. ఆశా సైనీ షాకింగ్ కామెంట్స్..