Sharwanand: జూన్‌ 3న శర్వా వివాహం.. అక్కడే వివాహ వేడుకలు

కథానాయకుడు శర్వానంద్‌ జూన్‌ 3న రాజస్థాన్‌లోని జైపుర్‌లో పెళ్లిపీటలెక్కనున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ వేడుకకి అక్కడి లీలా ప్యాలెస్‌ వేదిక కానుంది.

Updated : 18 May 2023 12:39 IST

థానాయకుడు శర్వానంద్‌ (Sharwanand) జూన్‌ 3న రాజస్థాన్‌లోని జైపుర్‌లో పెళ్లిపీటలెక్కనున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ వేడుకకి అక్కడి లీలా ప్యాలెస్‌ వేదిక కానుంది. తను మనసిచ్చిన రక్షిత మెడలో ఆయన మూడు ముళ్లు వేయనున్నారు. ఈ ఏడాది జనవరిలో శర్వానంద్‌, రక్షితల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. జైపుర్‌లో రెండు రోజులపాటు వివాహ వేడుకలు జరగనున్నట్టు శర్వానంద్‌ సన్నిహితులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని