Tollywood: తొలి అడుగు.. టాలీవుడ్లో విజయంతో ముందడుగు
Tollywood: మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ఫుల్ అయిన యువ దర్శకుల ఎవరో చూద్దామా!
దర్శకులకు తొలి చిత్రం ఎప్పుడూ ప్రత్యేకమే. ఆ సినిమా ఫలితం మీదే కెరీర్ ఆధారపడి ఉంటుంది. కెరీర్గ్రాఫ్ ఒక్కసారిగా పెరగాలన్నా, అధఃపాతాళానికి పడిపోవాలన్నా తొలి చిత్రమే కీలకం. ఓ రకంగా మొదటి సినిమా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశ పరీక్షలాంటిదే. ఈ ఏడాది కొందరు యువ దర్శకులు ఆ తొలిపరీక్షలో నెగ్గి విజయవంతంగా టాలీవుడ్లోకి అరంగేట్రం చేశారు. వారిలో కొందరు థియేటర్లో సూపర్ డూపర్ హిట్లు కొడితే, మరికొంత మంది నేరుగా ఓటీటీల ద్వారా హిట్లు సాధించారు. అలా ఈ ఏడాది మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అయినవారెవరో ఓ సారి చూద్దాం..
బుచ్చిబాబు వసూళ్ల ‘ఉప్పెన’
తెలుగులో మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని, అరంగేట్రంలోనే అందరిచూపుని తనవైపు తిప్పుకొన్నాడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘ఉప్పెన’తో తనదైన మార్క్ చూపించాడు. హీరోహీరోయిన్లకు కూడా ఇదే తొలిచిత్రం కావడం విశేషం. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిల జోడీ అందరినీ ఆకట్టుకుంది. సముద్రతీర ప్రేమకథగా వచ్చి బాక్సాఫీస్పై కాసుల వర్షం కురిపించింది. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమా విజయంలోనూ తోడ్పడింది. కథకు తగినట్లుగా బుచ్చిబాబు నటీనటులను ఎంచుకోవడమే కాకుండా, వారి నుంచి కావాల్సిన నటనను రాబట్టుకున్నాడు. దర్శకుడిలోని ఆ ప్రతిభే ‘ఉప్పెన’ చిత్రానికి ఘనవిజయాన్ని సాధించి పెట్టింది. తన తదుపరి చిత్రాన్ని ఓ అగ్రహీరోతో చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
వైవిధ్యానికి ‘నాంది’.. విజయ్ కనకమేడల
వరుస పరాజయాలతో సతమతమవుతున్న నరేశ్కు పునర్జన్మలాంటి ‘నాంది’. ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన విజయ్ కనకమేడల నరేశ్ను విభిన్నంగా చూపించి విజయానికి నాంది పలికాడు. చేయని నేరానికి జైలు శిక్షపడిన ఓ ఖైదీ ఏం చేశాడనే కథాంశంతో తెరకెక్కింది. తక్కువ బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం మంచి వసూళ్లనే సాధించింది. వరలక్ష్మి శరత్కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. హాస్యచిత్రాల కథానాయకుడిగా నరేశ్పై ఉన్న ముద్రను నాందితో చెరిపేశాడీ దర్శకుడు. థియేటర్ కలెక్షన్లతో పాటు ఓటీటీ, శాటిలైట్ హక్కులతో ‘నాంది’ లాభాలు ఆర్జించింది.
కలెక్షన్ల చోరుడు.. హసిత్ గోలి
కరోనా సెకండ్వేవ్ తర్వాత విడుదలైన చిత్రాల్లో సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతున్న సినిమా ‘రాజ రాజ చోర’. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు హీరో శ్రీ విష్ణు. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్లు రాబడుతోంది. డిజిటల్ హక్కులు కూడా భారీ రేటుకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని సమాచారం. మేఘా ఆకాశ్, సునైనాలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో శ్రీ విష్ణు దొంగగా నటించాడు. కడుపుబ్బా నవ్వించే కామెడీతో పాటు హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ కూడా బాగా పండటంతో ప్రేక్షకులు థియేటర్ల బాట పడుతున్నారు. సెకండ్ వేవ్ తర్వాత తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయం సాధించాడు హసిత్ గోలి.
మినీ కథతో మెగా విజయం.. కార్తీక్ రాపోలు
వైవిధ్యభరిత చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయం తెలిసిందే. ‘ఏక్ మినీ కథ’ కూడా వైవిధ్యంగా సాగే ఓ అడల్ట్ కామెడీ డ్రామా. థియేటర్లలో విడుదలవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల అమెజాన్ ప్రైమ్లో విడుదలయ్యింది. ఓటీటీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో విజయం సాధించాడు దర్శకుడు కార్తీక్ రాపోలు. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సాధించాడీ దర్శకడు. ‘ఏక్ మినీ కథ’కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్ప్లే అందించారు. కుర్ర హీరో శోభన్ ఈ సినిమాతో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. రూ.5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాను రూ. 9 కోట్లకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకోవడం విశేషం.
విజయానికి ‘శ్రీకారం’
తన మొదటి చిత్రం ‘శ్రీకారం’తో మంచి దర్శకుడిగా నిరూపించుకున్నాడు కిషోర్రెడ్డి. బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించిన ఈ సినిమాకు ఓటీటీ, శాటిలైట్ హక్కులతో కమర్షియల్గా పడిపోకుండా నిలబడింది. డిజిటల్ వేదికపై విడుదలైన ఈ చిత్రానికి ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. గ్రామీణ వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని సంభాషణలు, భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. శర్వానంద్, ప్రియాంక మోహన్ హీరోహీరోయిన్లుగా చేసిన ఈ సినిమాలో హీరో శర్వా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
సినిమా బండి.. ప్రవీణ్ కాండ్రేగుల
‘ఫ్యామిలీ మ్యాన్’ దర్శక ద్వయం రాజ్ డీకే తెలుగులో నిర్మించిన చిత్రం ‘సినిమా బండి’. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి. ఓ మారుమూల గ్రామంలోని ఆటో డ్రైవర్ తనకు దొరికిన కెమెరాతో సినిమా తీసేందుకు పడిన పాట్లు కడుపుబ్బా నవ్వించాయి. ఈ సినిమాలో వినిపించే యాస సినిమాకు ప్రత్యేకతను చేకూర్చింది. రెగ్యులర్ సినిమాల్లోని తెలుగుకు విభిన్నంగా అనంతపురం యాస విపరీతంగా ఆకట్టుకుంది. పల్లెటూరి అమాయకత్వం, సినిమా తీసే ప్రయత్నంలో పండిన కామెడీ నవ్వులు పూయించింది. అలా తొలి అడుగులోనే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు ఈ చిత్ర దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల.
వీరి ప్రయత్నాలూ మెప్పించాయి
కమర్షియల్ సక్సెస్ సాధించకున్నా.. తొలి చిత్రంతో చేసిన కొందరి ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. విభిన్న కథాంశంతో టాలీవుడ్ ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకున్నారు కొందరు దర్శకులు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘మెయిల్’ మంచి సినిమాగా నిలిచింది. కంబాలపల్లి కథలు సిరీస్లో వచ్చిన మొదటి భాగమిది. ‘ఆహా’లో విడుదలైన ఈ చిత్రంలో ప్రియదర్శి హీరోగా నటించాడు. తెలంగాణ గ్రామాల్లోకి కంప్యూటర్ వచ్చిన కాలంలో ఈ కథ సాగుతుంది. తెలంగాణ గ్రామాల్లోని ప్రజల అమాయకత్వం, అక్కడి మట్టి పరిమళాన్ని అందంగా చూపించాడు యువ దర్శకుడు ఉదయ్ గుర్రాల. అలాగే ‘ప్లే బ్యాక్’ చిత్రంతో హరి ప్రసాద్ జక్కా చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. థియేటర్లో ఆశించిన వసూళ్లు రాబట్టుకోలేకపోయిన ఈ చిత్రం.. ఓటీటీల్లోకి వచ్చాక జనాదరణ పొందింది. వితంతువుతో హీరో ప్రేమలో పడే కథాంశంతో ‘చావు కబురు చల్లగా’ తెరకెక్కింది. మంచి కాన్సెప్ట్తో తెరకెక్కినా కథకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోవడంతో బాక్సాఫీసు వద్ద చతికిలపడింది. కానీ దర్శకుడు కౌషిక్ పెగల్లపాటి మొదటి సినిమాతోనే చేసిన ఈ ప్రయత్నానికి ప్రశంసలు దక్కాయి. ఇలా కొంతమంది బాక్సాఫీసు వద్ద సూపర్హిట్లు కొడితే, మరికొంత మంది తమ ప్రయత్నాలతో అలరించే ప్రయత్నం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
శ్రీదేవికి రజనీ కంటే ఎక్కువ పారితోషికం
దివంగత తార శ్రీదేవిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్స్టార్ అని సంబోధిస్తుంటారు. -
‘దేవర’ ఎన్టీఆర్కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది: కొరటాల శివ
‘దేవర’ సినిమా ఎన్టీఆర్కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
తెలుగు దర్శకుల.. బాలీవుడ్ దండయాత్ర
పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్.. టాలీవుడ్ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా.. -
సలార్ 2 ఈ నెలాఖరు నుంచే
ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో ప్రయాణం చేయడంలో ప్రభాస్ రాటుదేలారు. కొన్నేళ్లుగా ఆయన ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది. -
కరీనా స్థానంలో నయన్?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
సన్నీ.. తులసీల ప్రేమ కథ
‘బవాల్’ తర్వాత వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ మళ్లీ జోడిగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. ఈ రొమాంటిక్ లవ్స్టోరీని శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. -
కోల్పోయిన అవకాశం తిరిగొచ్చింది
‘ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటోంది ప్రగ్యా జైస్వాల్. -
మనసుల్ని హత్తుకునే.. రాజు యాదవ్
‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా. -
ధ్రువ్ విక్రమ్.. కబడ్డీ ఆటగాడిగా
విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ తాజాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్రువ్ విక్రమ్ కథానాయకుడు. దిగ్గజ కబడ్డీ ఆటగాడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు