RGV: ‘కొండా’చిత్రానికి శ్రీకారం

అదిత్‌ అరుణ్‌, ఇర్రా మోర్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొండా’. వరంగల్‌లోని కొండా మురళి, కొండా సురేఖ దంపతుల

Updated : 13 Oct 2021 07:19 IST

దిత్‌ అరుణ్‌, ఇర్రా మోర్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొండా’. వరంగల్‌లోని కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా రూపొందుతోంది. మల్లా రెడ్డి, నవీన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మంగళవారం వరంగల్‌లోని వంచనగిరిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ.. ‘‘కొండా మురళి చరిత్ర నాకు చాలా నచ్చింది’’ అన్నారు. ‘‘ఆర్జీవీ మమ్మల్ని గుర్తించి.. ముందుకొచ్చి ఈ సినిమా చేస్తానని ధైర్యంగా చెబుతున్నారు. చాలా  సంతోషంగా ఉంద’’న్నారు కొండా సురేఖ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని