MAA Elections: నరేశ్ వల్లే ‘మా’లో ఇన్ని గొడవలు
‘మా’లో ఇప్పుడు జరుగుతున్న వివాదాలన్నింటికీ నరేశ్ మాత్రమే కారణమని నటుడు శివాజీ రాజా ఆరోపించారు. మరో మూడు రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల నేపథ్యంలో ఎన్నడూ లేనివిధంగా సినీ పరిశ్రమ...
శివాజీ రాజా సంచలన ఆరోపణలు
హైదరాబాద్: ‘మా’లో ఇప్పుడు జరుగుతోన్న వివాదాలన్నింటికీ నరేశ్ ఒక్కడే కారణమని ‘మా’ మాజీ అధ్యక్షుడు, నటుడు శివాజీ రాజా ఆరోపించారు. విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలతో ఈసారి ‘మా’ ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడిగా పనిచేసిన శివాజీ రాజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. గతేడాది నాగబాబు మద్దతు ప్రకటించి ఉండకపోయి ఉంటే నరేశ్ విజయం సాధించేవాడు కాదని అన్నారు. నరేశ్కు నాగబాబు ఎందుకు మద్దతు ఇచ్చారో ఇప్పటికీ తనకి తెలియదని పేర్కొన్నారు. ఇక నరేశ్ ఆడే పాచికల ఆటలో ప్రాణమిత్రులు కూడా విడిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయని శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో నరేశ్ చిన్నపిల్లాడు. అతడు ఎప్పుడూ అబద్ధాలే చెబుతాడు. అతడి నోటి వెంట నిజం వచ్చిన రోజు నేను ఆశ్చర్యపోతా. నరేశ్ నాకు శత్రువు కాదు. కానీ అతడు నాపై అసత్యప్రచారాలు చేశాడు. నేను ‘మా’ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫండ్ రైజింగ్ కోసం అమెరికాలో ఓ ఈవెంట్ నిర్వహించాం. సినీ పరిశ్రమకు చెందిన సీనియర్, జూనియర్ నటీనటుల్ని తీసుకువెళ్లి అక్కడ ప్రోగ్రామ్ చేశాం. చిరంజీవి కూడా వచ్చారు. జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న నరేశ్ ఆ ప్రోగ్రామ్కి రాలేదు. ఇక్కడ వేరే వాళ్లతో మీటింగ్ పెట్టుకున్నాడు. యూఎస్ టూర్ విమాన టిక్కెట్ల వ్యవహారంలో నేను, శ్రీకాంత్ డబ్బులు వాడుకున్నామని ఆరోపణలు వచ్చేలా చేశాడు. దీనిపై చిరంజీవి.. సినీ పెద్దలతో ఓ కమిటీ వేసి అవన్నీ అవాస్తవాలే అని.. శ్రీకాంత్, నేను డబ్బుల విషయంలో ఎలాంటి తప్పులు చేయలేదని తేల్చారు. అయినా సరే.. నరేశ్ ఇప్పటివరకూ మాకు క్షమాపణలు చెప్పలేదు. నా హయాంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ల ద్వారా వచ్చిన ఫండ్ని ఇప్పుడు ‘మా’ సంక్షేమం కోసం నరేశ్ వినియోగిస్తున్నాడు. అతని రాకతోనే అసోసియేషన్లో రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ‘మా’ ఎన్నికలు రచ్చకెక్కడానికి అతడే కారణం. చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలు ఆడతాడు. నాకు, శ్రీకాంత్కి సారీ చెప్పేవరకూ నేను అతడిని తిడుతూనే ఉంటాను. అతడి వల్ల మా స్నేహ్నాలు కూడా చెడిపోయాయి’
‘‘మా’ సభ్యుల కోసం ఓ వృద్ధాశ్రమం నిర్మించాలని నేను అనుకున్నాను. దానికి ఫండ్ రైజ్ చేయడం కోసం యూఎస్లో మరోసారి ప్రోగ్రామ్ పెట్టాలనుకున్నాను. మహేశ్తో ఆ విషయం చెప్పగానే.. ‘నాకు ఓకే. ఒక్కసారి నమ్రతని కలిసి ఈ విషయం చెప్పండి’ అని అన్నారు. వెంటనే నేను, బెనర్జీ, నరేశ్ మరో ఎనిమిది మంది సభ్యులు మహేశ్ ఇంటికి వెళ్లి నమ్రతతో మాట్లాడాం.. ఆమె కూడా ఓకే అన్నారు. ప్రభాస్ని కలిస్తే.. ‘వరుస షూటింగ్స్తో బిజీగా ఉన్నాను. రాలేకపోవచ్చు. మీరు ఎక్కువగా శ్రమించకండి. ఆ ఫండ్లో నా వాటాగా రూ.2 కోట్లు ఇస్తాను’ అని చెప్పారు. ఆ మాట నాకెంతో తృప్తినిచ్చింది. ఇలా స్టార్హీరోహీరోయిన్స్ ప్రోగ్రామ్కి ఓకే అన్నాక.. నరేశ్ ప్రెస్మీట్ పెట్టి నాపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత వెంటనే ‘మా’ ఎన్నికలు జరిగాయి. మా ప్యానల్ ఓడిపోయింది. దాంతో ఆ ప్రోగ్రామ్ ఆగిపోయింది. నా కల అలాగే నిలిచిపోయింది. నిజం చెప్పాలంటే మహేశ్ వాళ్ల ఇల్లు ఎక్కడో కూడా నరేశ్కి సరిగ్గా తెలీదు’ అని శివాజీ రాజా తీవ్ర ఆరోపణలు చేశాడు. అనంతరం ఈసారి జరుగుతున్న ‘మా’ ఎన్నికలపై తాను స్పందించాలనుకోవడం లేదని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని