Radheshyam: ‘రాధేశ్యామ్’ 2022లోనే అని నాలుగేళ్ల కిందే చెప్పారు
‘‘మనకూ... మన నమ్మకానికీ మధ్య జరుగుతున్న యుద్ధమే ‘రాధేశ్యామ్’ కథ. ఇది జరిగిపోయింది కాదు, జరగబోయేది కాదు... ఎప్పుడూ జరిగే ఓ కథ’’ అన్నారు రాధాకృష్ణ కుమార్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘రాధేశ్యామ్’.
రాధాకృష్ణ కుమార్
‘‘మనకూ... మన నమ్మకానికీ మధ్య జరుగుతున్న యుద్ధమే ‘రాధేశ్యామ్’ కథ. ఇది జరిగిపోయింది కాదు, జరగబోయేది కాదు... ఎప్పుడూ జరిగే ఓ కథ’’ అన్నారు రాధాకృష్ణ కుమార్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘రాధేశ్యామ్’. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణంరాజు సమర్పిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర సాంకేతిక బృందం శనివారం హైదరాబాద్లో విలేకర్లతో సమావేశమైంది. ఆ విషయాలివీ...
‘‘ప్రభాస్ ఇమేజ్ విషయంలో అభిమానుల అంచనాలకు మించి ఉంటుందీ చిత్రం. పద్దెనిమిదేళ్ల కిందట విన్న ఈ కథాలోచన నాలో స్ఫూర్తిని రగిలించింది. వేల ఏళ్లుగా ఉన్న ఓ ప్రశ్న. అయితే దానికి సమాధానం చెబుతున్నానని కాదు కానీ, దానికి నా వివరణ ఏమిటన్నది తెరపైనే చూడాలి. ఈ కథ ఈ స్థాయికి రావడానికి నా గురువు చంద్రశేఖర్ ఏలేటి, కథానాయకుడు ప్రభాస్లే కారణం. నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ రోజు వరకూ ఏది కావాలంటే అది ఇచ్చారు. ఈ సినిమా కోసం తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద జ్యోతిష్యుల్ని కలిశాం. వాళ్లలో ఒకరు ముందే చెప్పారు... ఈ చిత్రం 2022 ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశముందని... అదే జరుగుతోంది ఇప్పుడు. ట్రైలర్ చూసినవాళ్లంతా విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయని చెబుతున్నారు. కమల్కన్నన్, ఆయన బృందానికే ఈ క్రెడిట్ దక్కుతుంది. 12 దేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ పని జరుగుతోంది’’.
- రాధాకృష్ణ కుమార్, దర్శకుడు
‘‘హీరో ప్రభాస్లాగే ఈ సినిమా ఒప్పుకొన్నప్పుడు నాకు పెళ్లి కాలేదు. ఈ ప్రయాణంలోనే నాకు పెళ్లయింది. మా బాబు ఇప్పుడు స్కూల్కి వెళుతున్నాడు. ఈ చిత్రం కోసం నాలుగేళ్లు ప్రయాణం చేశాం. ‘రాధేశ్యామ్’ కథ విన్నాక రెండు రోజులకి ‘వర్షం’ సినిమాని మరోసారి చూసుకుని, బాగా ఆస్వాదించి ‘బాహుబలి’ నుంచి బయటకొచ్చి ఈ సినిమా చేశా. హాలీవుడ్లో స్టూడియో ఫార్మాట్లో తీసినట్టుగా పెట్టుబడి, రాబడితో సంబంధం లేకుండా కథ కోరుకున్నట్టుగా చేశాం. రాధాకృష్ణ కుమార్ దగ్గర గొప్ప ఆలోచనలున్నాయి. భారతీయ తెరపై అవి ఆవిష్కారం కాబోతున్నాయి’’.
- మనోజ్ పరమహంస, ఛాయాగ్రాహకుడు
‘‘ప్రపంచంలోనే కళకి ఎక్కువ విలువిస్తాయి యూరోపియన్ దేశాలు. అందులో ఇటలీ ఒక ప్రధాన దేశం. ఆ దేశం నేపథ్యంలో 1970లో జరిగే ప్రేమకథ ఇది, దానికి ప్రొడక్షన్ డిజైనర్గా పని చేయాలన్నప్పుడు ఇదో సవాల్గా అనిపించింది. ఎవ్వరూ రాజీ పడకుండా పనిచేశారు. అందరం ఒకే తరహా ఆలోచనలతో పనిచేసిన నా తొలి సినిమా ఇది. ఆ ప్రభావం జనవరి 14న తెరపై స్పష్టంగా కనిపిస్తుంది’’.
- రవీందర్, ప్రొడక్షన్ డిజైనర్
‘‘దీనికోసం సహజత్వంతో కూడిన సంగీతాన్ని ఇవ్వాలనుకున్నాం. అందుకోసం ఎలక్ట్రానిక్స్ వాయిద్యాల్ని కాకుండా సహజమైన వాయిద్యాలతో సంగీతం సమకూర్చే ప్రయత్నం చేశాం. బుడాపెస్ట్లో ప్రత్యేకమైన ఆర్కెస్ట్రాతో కలిసి పాటలు సమకూర్చాం’’.
- జస్టిన్ ప్రభాకరన్, సంగీత దర్శకుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు