Krithishetty: రామ్‌ సినిమా.. కృతిశెట్టిపై డైరెక్టర్‌ ఫైర్‌..?

‘ఉప్పెన’తో బేబమ్మగా తెలుగువారికి చేరువైన నటి కృతిశెట్టి. తన అందచందాలతో మొదటి సినిమాతోనే కుర్రకారు హృదయాలు గెలుచుకున్న ఈ భామ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఆమె చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్‌లలో RAPO 19 ఒకటి...

Updated : 11 Aug 2021 15:13 IST

ఎమోషన్స్‌ పండించలేక ఇబ్బందిపడ్డ బేబమ్మ

హైదరాబాద్‌: ‘ఉప్పెన’తో బేబమ్మగా తెలుగువారికి చేరువైన నటి కృతిశెట్టి. తన అందచందాలతో మొదటి సినిమాతోనే కుర్రకారు హృదయాలు గెలుచుకున్న ఈ భామ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. రామ్‌ పోతినేని కథానాయకుడిగా కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రంలో ఆమె నటిస్తున్నారు. ఆదిపినిశెట్టి, నాజర్‌ కీలక పాత్రలు పోషిష్తున్నారు.

ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ఇటీవల ప్రారంభమైంది. తాజాగా జరిగిన షెడ్యూల్‌లో కృతిశెట్టిపై లింగుస్వామి ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. నాజర్‌-కృతిశెట్టిలపై ఓ ఎమోషనల్‌ సీన్‌ చిత్రీకరించారని.. భావోద్వేగాలను పండించడంలో ఆమె విఫలమయ్యారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గంటపాటు ఎన్నో రీటేక్‌లు తీసుకున్నప్పటికీ సీన్‌ ఓకే కాకపోవడంతో నాజర్‌ అసహనానికి గురయ్యారని.. దాంతో లింగుస్వామి ఆమెను తిట్టారని సమాచారం. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ స్వరాలు అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని