Cinema News: డిసెం‘బరి’
డిసెంబర్లో అగ్ర తారల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం అరుదు. తెలుగు నాట సంక్రాంతి హడావిడి ముందే మొదలైపోతుంది కాబట్టి... డిసెంబర్ మొత్తం పెద్ద పండగకి వచ్చే సినిమాల హడావిడే ఎక్కువ. వాటికి సంబంధించిన
ముగింపులో మెరుపులున్నాయ్
డిసెంబర్లో అగ్ర తారల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం అరుదు. తెలుగు నాట సంక్రాంతి హడావిడి ముందే మొదలైపోతుంది కాబట్టి... డిసెంబర్ మొత్తం పెద్ద పండగకి వచ్చే సినిమాల హడావిడే ఎక్కువ. వాటికి సంబంధించిన ప్రచారం, వేడుకలతో చిత్రసీమ బిజీ బిజీగా గడుపుతుంటుంది. మహా అంటే క్రిస్మస్, జనవరి 1ని లక్ష్యంగా చేసుకుని ఒకట్రెండు సినిమాలు వస్తుంటాయంతే. సంక్రాంతికే అసలు సిసలు సినీ సందడి. ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పండగ ముందే వచ్చేసిందా? అన్నట్టుగా అగ్ర తారల సినిమాలు బాక్సాఫీసు ముందుకు వరుస కడుతున్నాయి. గల్లా పెట్టెలు.. కొత్త రికార్డులు సంక్రాంతి కోసం వామ్అప్ చేసుకోవాలేమో అన్నట్టుగా... ‘తగ్గేదే లే’ అంటూ వేసవి వరకు సినిమాలు పక్కా ప్రణాళికలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
కరోనా రెండో దశ తర్వాత
జులై నెలాఖరుకే తెలుగులో సినిమాలు విడుదలలు ప్రారంభమయ్యాయి. తెలుగు ప్రేక్షకుడు అందరికంటే ధైర్యంగా థియేటర్కి వచ్చి టికెట్ కొన్నాడు. ఆ భరోసా... ఆ ఉత్సాహం చిత్రసీమపై స్పష్టమైన ప్రభావమే చూపించింది సినిమాలు ఒకదాని వెంట మరొకటి వచ్చాయి. అయితే నమోదైన విజయాలు కొన్నే. కుటుంబ ప్రేక్షకులతో పాటు... మాస్ ప్రేక్షకుడూ పూర్తిస్థాయిలో థియేటర్కి రావడం లేదనే విషయాన్ని వసూళ్లు రుజువు చేస్తూ వచ్చాయి. నవంబర్లో అయితే పదుల సంఖ్యలో విడుదలైనా ఒక్క విజయమూ నమోదు కాలేదు. ఇప్పుడు అందరి చూపూ ముగింపుపైనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లకి ప్రేక్షకులు మునుపటిలా పోటెత్తాలంటే అగ్ర తారల చిత్రాలు విడుదల మాత్రమే మార్గమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు తగ్గట్టే డిసెంబర్ మాసంలో బాలకృష్ణ, అల్లు అర్జున్, నాని తదితర తారలు తమ సినిమాలతో సందడి చేస్తున్నారు.
‘అఖండ’తో ఆరంభం
ఈ ఏడాది తెలుగు చిత్రాలకు కీలకమైన ఈ నెలను బాలకృష్ణ ‘అఖండ’తో ఆరంభిస్తున్నారు. మాస్ ప్రేక్షకుల్ని మరింత ఉత్సాహంగా థియేటర్కి రప్పించే సత్తా ఉన్న కలయిక... బాలకృష్ణ - బోయపాటి శ్రీను. విజయవంతమైన ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత ఆ కలయికలో రూపొందిన ‘అఖండ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు, మాస్ ప్రేక్షకుల్లోనూ అత్యంత ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం గురువారమే విడుదలవుతోంది. ప్రారంభ వసూళ్లు మరో స్థాయిలో ఉండనున్నాయనడానికి ముందుస్తుగా అమ్ముడవుతున్న టికెట్లే ఉదాహరణ. విదేశాల్లోనూ ఈ సినిమా బాక్సాఫీసుని పెద్దఎత్తున ప్రభావితం చేస్తోంది. బాలయ్య మళ్లీ థియేటర్లకి మునుపటి కళ తీసుకురావడం ఖాయమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నెల 3న మరో స్టార్ కథానాయకుడు మోహన్లాల్ నటించిన ‘మరక్కార్’ విడుదలవుతోంది. ఇప్పటికే జాతీయ అవార్డుల్ని సొంతం చేసుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. 4న నిత్యమేనన్, సత్యదేవ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ‘స్కైలాబ్’ విడుదలవుతోంది. వీటి ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. విజయంపై నమ్మకాన్ని పెంచుతున్నాయి.
పుష్ప... రాయ్
తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా స్థాయి చిత్రాలే గుర్తుకొస్తాయి. ఇటీవల బహుభాషల్ని లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న అగ్ర తారల సినిమాలే ఎక్కువ. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్
దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’, నాని కథానాయకుడిగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవుతున్నాయి. ‘పుష్ప’ ఈ నెల 17న విడుదలవుతుండగా, ‘శ్యామ్ సింగరాయ్’ క్రిస్మస్ని పురస్కరించుకుని డిసెంబర్ 24న వస్తోంది. ‘పుష్ప’ అల్లు అర్జున్కి తొలి పాన్ ఇండియా సినిమా. శేషాచలం అడవుల నేపథ్యంలో రూపొందుతోంది. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం కావడం, అల్లు అర్జున్తో ఆయనకి మూడో సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం ఈ చిత్రంలోని ఐటమ్సాంగ్ని రామోజీ ఫిల్మ్సిటీలో చిత్రీకరిస్తున్నారు. ‘శ్యామ్ సింగరాయ్’ నాని కెరీర్లోనే అత్యధిక వ్యయంతో తెరకెక్కింది. కోల్కతా నేపథ్యంలో, పీరియాడిక్ డ్రామాగా రూపొందింది. సాయిపల్లవి, కృతిశెట్టి తదితరులు ఆకర్షణగా నిలుస్తున్నారు. వరుసగా రెండు సినిమాల తర్వాత... థియేటర్లలో విడుదలవుతున్న నాని సినిమా ఇది. డిసెంబర్ 24నే కపిల్దేవ్ బయోపిక్గా తెరకెక్కిన ‘83’ కూడా విడుదలవుతోంది. తెలుగులో అనువాదంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
వీళ్లూ ఉన్నారు...
అగ్ర తారల సినిమాలే కాదు, పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాలూ ఈ నెలలోనే సందడికి ముస్తాబయ్యాయి. డిసెంబర్ 10న నాగశౌర్య ‘లక్ష్య’, అదే రోజునే కీర్తిసురేష్ ‘గుడ్లక్ సఖి’, శ్రియ, నిత్యమేనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ నటించిన ‘గమనం’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఎప్పుడూ లేని రీతిలో డిసెం‘బరి’ రసవత్తరంగా మారింది. కొత్త సినిమాల విడుదలలతో కళకళలాడనుంది. సంక్రాంతికి దీటైన వ్యాపారం ఈ నెలలో జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు