మోదీ.. దేశంలోనే అగ్రనాయకుడు: సంజయ్
ప్రధాని మోదీని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసించారు. దేశంలోనే మోదీ అగ్రనాయకుడనీ, భాజపా అగ్రపార్టీ అని ఆయన అన్నారు. ఇందులో వింతేముంది అనుకోవద్దు. సాధారణంగా ప్రతిపక్షనేతలు అధికార పార్టీ నేతలను ప్రశసించరు. అందులోనూ రాజకీయ పరమైన కారణాలతో రెండు చిరకాల మిత్ర పక్షపార్టీలు విడిపోయిన తర్వాత అలా జరగడం...
దిల్లీ: ప్రధాని మోదీని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసించారు. దేశంలోనే మోదీ అగ్రనాయకుడనీ, భాజపా అగ్రపార్టీ అని ఆయన అన్నారు. ఇందులో వింతేముంది అనుకోవద్దు. సాధారణంగా ప్రతిపక్షనేతలు అధికార పార్టీ నేతలను ప్రశంసించరు. అందులోనూ రాజకీయ పరమైన కారణాలతో రెండు చిరకాల మిత్ర పక్షపార్టీలు విడిపోయిన తర్వాత అలా జరగడం చాలా అరుదు. అయితే.. తౌక్టే తుపాను పరిహారం నిధులపై చర్చించేందుకు ప్రధాని మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశమైన తర్వాత సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘‘గత ఏడేళ్లలో భాజపా విజయానికి మోదీయే కారణం. దేశంలో ప్రస్తుతం ఆయనే అగ్రనాయకుడు. భాజపాయే అగ్ర పార్టీ. ఈ విషయాన్ని నేను ఏ మీడియా రిపోర్టుల ఆధారంగా చెప్పడం లేదు. దీనిపై అధికారికమైన ప్రకటన ఏదీ లేదు’’ అని సంజయ్ వెల్లడించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఇమేజ్తోనే భాజపా అధికారంలోకి వచ్చిందని రౌత్ అన్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త వ్యతిరేకత వ్యక్తమైన మాట వాస్తవమేనని చెప్పారు. కేరళలో ఒక్కస్థానాన్ని కూడా దక్కించుకోని భాజపా.. తమిళనాడులో 4, పశ్చిమ్ బెంగాల్లో 77 స్థానాలకు పరిమితమైన విషయం తెలిసిందే.
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు భాజపా, శివసేన మిత్రపక్షాలుగా ఉండేవి. అయితే రాజకీయ పరమైన విభేధాలతో ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ‘మహా వికాస్ అఘాడీ’గా ఏర్పడి అధికారం అందుకుంది. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, మోదీతో, ఉద్దవ్ ఠాక్రే సమావేశమైన తర్వాత సంజయ్ రౌత్ భాజపాకు అనుకూలంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
-
లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్