మహారాష్ట్రలో త్వరలో భాజపా ప్రభుత్వం: నడ్డా
మహారాష్ట్రలో త్వరలోనే భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు వచ్చినా మోసపోయామని, కానీ త్వరలోనే తమ.........
భాజపా చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబయి: మహారాష్ట్రలో త్వరలోనే భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు వచ్చినా మోసపోయామని, కానీ త్వరలోనే తమ పార్టీ సొంతంగానే రాష్ట్రంలో అధికారం చేపడుతుందన్నారు. గురువారం మహారాష్ట్ర భాజపా ఆఫీస్బేరర్ల సమావేశంలో సమావేశంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భాజపా వైపే తీర్పు ఇచ్చినప్పటికీ.. తాము మోసపోయామన్నారు. త్వరలోనే మహారాష్ట్రలో సొంతంగానే తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మూడు రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో కూర్చుంటాయని, భాజపా సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని పునరుద్ఘాటించారు.
మహారాష్ట్రలో పరిస్థితి ఏమీ బాగాలేదన్న నడ్డా.. ఎవరు అధికారంలో ఉన్నారో ఎవరికీ తెలియడంలేదని విమర్శించారు. కుడిచేయి ఏం చేస్తోందో ఎడమ చేతికి కూడా తెలియడంలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు దేవేంద్ర ఫడణవీస్నే మళ్లీ సీఎంగా చూడాలని కోరుకుంటున్నారన్నారు. ప్రస్తుతం భాజపానే నిజమైన ప్రతిపక్షమని, త్వరలో తామే అధికార పార్టీగా అవతరిస్తామని నడ్డా అన్నారు. 2019 ఎన్నికల్లో భాజపా, శివసేన కలిసి పోటీ చేసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు, అధికార పంపిణీ విషయంలో తలెత్తిన విభేధాల నేపథ్యంలో శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?