పార్లమెంట్లో విపక్షాల నిరసన
రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులపై విపక్షాలు నిరసన కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా విపక్షాలకు చెందిన ఎంపీలంతా పార్లమెంటు ఆవరణలో ర్యాలీ నిర్వహించి
దిల్లీ: రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులపై విపక్షాలు నిరసన కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా విపక్షాలకు చెందిన ఎంపీలంతా పార్లమెంటు ఆవరణలో ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయడానికి వీల్లేని విధంగా ప్రైవేటు సంస్థలకు కళ్లెం వేసేలా బిల్లును తీసుకురావాలని, స్వామినాథన్ కమిషన్ చెప్పిన ప్రకారం కనీస మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేయాలని కోరారు.
మరో వైపు రాజ్యసభ నుంచి సస్పెండైన 8మంది ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. విపక్షపార్టీలకు చెందిన పలువురు ఎంపీలు వారికి మద్దతిచ్చారు. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సమాజ్వాదీ, శివసేన,ఆర్జేడీ, డీఎంకే, తెరాస, ఆప్ ఎంపీలంతా నిరసనలో పాల్గొన్నారు. సాయంత్రం 5గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రతిపక్షాలు భేటీ అయ్యే అవకాశముంది. వ్యవసాయ బిల్లులు, వాటి ఆమోద సమయంలో జరిగిన పరిణామాలపై విపక్షాలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నాయి. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో కేవలం ఐదుగురు నాయకులను మాత్రమే రాష్ట్రపతి భవన్ అధికారులు అనుమతించినట్లు సమాచారం. రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాంనబీ అజాద్ చాంబర్లో సమావేశమైన విపక్షనేతలు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్