‘మీరే రండి.. లేదా పవారే ఎన్డీయేతో కలుస్తారు’
మహారాష్ట్రలో భాజపాతో మళ్లీ శివసేన ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి, ఆర్పీఐ(ఏ) పార్టీ నేత రాందాస్ ఆఠవాలే అన్నారు. అధికారం పంచుకొనే ఫార్ములాను రెండు కాషాయ పార్టీలకు ప్రతిపాదించారు. సోమవారం ఆయన .......
భాజపాతో మళ్లీ కలవాలంటూ శివసేనకు ఆఫర్
కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబయి: మహారాష్ట్రలో భాజపాతో మళ్లీ శివసేన ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి, ఆర్పీఐ(ఏ) పార్టీ నేత రాందాస్ అథవాలే అన్నారు. అధికారం పంచుకొనే ఫార్ములాను రెండు కాషాయ పార్టీలకు ప్రతిపాదించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఏడాది పాటు సీఎంగా ఉండాలని, ఆ తర్వాత మూడేళ్ల పాటు ఆ పదవిలోకి భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ ఉంటారని సూచించారు. ఒకవేళ భాజపాతో శివసేన బంధం ఏర్పరచుకొనేందుకు ముందుకు రాకపోతే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎన్డీయేతో కలుస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేతో ఎన్సీపీ నేత పవార్ చేతులు కలిపితే ఆయనకు భవిష్యత్తులో పెద్ద పదవి వచ్చే అవకాశం ఉందన్నారు.
మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శనివారం ఓ హోటల్లో కలవడంపై అనేక ఊహాగానాలు చెలరేగిన నేపథ్యంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, సామ్నా పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉన్న రౌత్ స్పందిస్తూ.. ఫడణవీస్ను ఇంటర్వ్యూ కోసమే కలిసినట్టు స్పష్టంచేశారు.
ఈ నేపథ్యంలో అథవాలే స్పందిస్తూ.. ‘‘శివసేన భాజపాతో మళ్లీ కలిస్తే ఠాక్రే ఏడాది పాటు, ఫడణవీస్ మిగతా మూడేళ్లు సీఎంగా కొనసాగుతారు. శివసేనకు ఒకటి లేదా రెండు కేంద్రమంత్రి పదవులు వస్తాయి కూడా’’ అని తెలిపారు.
గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసిన శివసేన- భాజపా మధ్య ప్రభుత్వ ఏర్పాటు అంశంపై వైరుధ్యం ఏర్పడటంతో తీవ్ర ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ తరుణంలో శివసేన సైద్ధాంతిక విరోధిగా ఉన్న ఎన్సీపీ, కాంగ్రెస్తో చేతులు కలిపి మహా వికాస్ అఘాడీ కూటమిని ఏర్పాటు చేసి గతేడాది నవంబర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..