62 కోట్ల కార్మికుల వైపు నిలవండి..
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించి, కోట్లాది కార్మికుల పక్షాన నిలవాల్సిందిగా దేశప్రజలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ
దేశ ప్రజలకు కాంగ్రెస్ పిలుపు
దిల్లీ: వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించి, కోట్లాది కార్మికుల పక్షాన నిలవాల్సిందిగా దేశప్రజలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలపాలంటూ ఆ పార్టీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రణ్దీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘‘క్రూరమైన ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న 62 కోట్ల వ్యవసాయదారుల వైపు దేశమంతా నిలవాలి. తన ప్రియమైన పెట్టుబడిదారులకు మేలు కలిగించేందుకు ప్రధాని ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. పేదలను ఆయన పట్టించుకోరు’’ అని తెలిపారు. ‘‘ఇది రైతులను బానిసలుగా చేసే ప్రయత్నం. దీనివల్ల వారు తమ పొలాల్లోనే కూలీలుగా మారుతారు. వారికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లభించకపోగా.. వారి గౌరవం కూడా నిలబడదు.’’ అని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ సామాజిక మాధ్యమాల్లో విమర్శించారు.
పంజాబ్, హరియాణాలలో రైతులు పార్టీలకు అతీతంగా ఈ రోజు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. గతంలో ఎన్నడూలేని విధంగా పంజాబ్లోని 31 వ్యవసాయ సంఘాలు ఏకమై ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నాయి. ఆయా రాష్ట్రాల దుకాణదారులు కూడా వారికి మద్దతు పలికి దుకాణాలను మూసివేసారు. గురువారం మొదలైన మూడురోజుల ‘రైల్ రోకో’ కార్యక్రమం కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్