Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది.

Published : 23 Sep 2023 20:48 IST

హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరు 30న కాకుండా అక్టోబరు 1న రాష్ట్రానికి రానున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. శాసనసభ ఎన్నికల కార్యాచరణను బహుముఖ వ్యూహంతో ముందుకు తీసుకెళ్లాలని భాజపా నిర్ణయించింది.

క్షేత్రస్థాయి కీలక కార్యాచరణకు ఈ నెలాఖరులోపు తుదిరూపు ఇచ్చి అక్టోబరులో ప్రధాని సహా అగ్రనేతల సభలు, అభ్యర్థుల ప్రకటన వంటి కీలక అంశాలతో ఎన్నికల దిశగా అడుగులేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అక్టోబరు 1న ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాలతోనూ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని